Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకుల కోసం కోర్టుకెక్కిన దర్శకుడు శ్రీనువైట్ల భార్య?

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (16:05 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన మరో జంట విడిపోనుంది. తన భర్త నుంచి విడాకులు మంజూరు చేయాలని టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల సతీమణి రూప కోర్టు మెట్లెక్కారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన అనేక చిత్రాల్లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన రూప ఫ్యాషన్ రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలుగు చిత్రపరిశ్రమలో మంచి గుర్తింపుకలిగిన ఫ్యాషన్ డిజైనర్‌గా మారిపోయారు. ఆమెను శ్రీనువైట్ల వివాహం చేసుకున్నారు. ఇపుడు వీరిద్దరూ విడిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. 
 
తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు కూడా శ్రీను వైట్ల కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అందుకే రూప తన భర్త నుంచి విడాకులు కోరుతూ హైదరాబాద్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. గతంలో ఒకసారి ఇదేవిధంగా ఆమె కోర్టుకెక్కింది. 
 
కానీ, ఆమె తల్లిదండ్రులు వారించడంతో సర్దుకుపోయింది. కానీ, ఈ దఫా మాత్రం రూప తాను నిర్ణయంపై గట్టిగా నిలబడి విడాకుల కోసం పోరాటం చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై శ్రీను వైట్ల స్పందించాల్సివుంది. కాగా, వీరిద్దరూ గత నాలుగేళ్లుగా వేర్వేరుగా జీవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments