Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకుల కోసం కోర్టుకెక్కిన దర్శకుడు శ్రీనువైట్ల భార్య?

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (16:05 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన మరో జంట విడిపోనుంది. తన భర్త నుంచి విడాకులు మంజూరు చేయాలని టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల సతీమణి రూప కోర్టు మెట్లెక్కారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన అనేక చిత్రాల్లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన రూప ఫ్యాషన్ రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలుగు చిత్రపరిశ్రమలో మంచి గుర్తింపుకలిగిన ఫ్యాషన్ డిజైనర్‌గా మారిపోయారు. ఆమెను శ్రీనువైట్ల వివాహం చేసుకున్నారు. ఇపుడు వీరిద్దరూ విడిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. 
 
తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు కూడా శ్రీను వైట్ల కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అందుకే రూప తన భర్త నుంచి విడాకులు కోరుతూ హైదరాబాద్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. గతంలో ఒకసారి ఇదేవిధంగా ఆమె కోర్టుకెక్కింది. 
 
కానీ, ఆమె తల్లిదండ్రులు వారించడంతో సర్దుకుపోయింది. కానీ, ఈ దఫా మాత్రం రూప తాను నిర్ణయంపై గట్టిగా నిలబడి విడాకుల కోసం పోరాటం చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై శ్రీను వైట్ల స్పందించాల్సివుంది. కాగా, వీరిద్దరూ గత నాలుగేళ్లుగా వేర్వేరుగా జీవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments