Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాంపల్లి నుంచి కర్నూలు మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలు

train
, ఆదివారం, 17 జులై 2022 (09:58 IST)
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి కర్నూలు మీదుగా తిరుపతి వరకు ప్రత్యేక రైలును నడుపనుంది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సి.హెచ్.రాకేశ్ వెల్లడించారు 
 
ఈ నెల 23, 30 తేదీల్లో 07509 నంబరు రైలు హైదరాబాద్‌ నుంచి సాయంత్రం 4.35 నిమిషాలకు బయలుదేరి కర్నూలుకు రాత్రి 9.30కు చేరుకుంటుంది. అక్కడ నుంచి మరుసటి రోజు ఉదయం 5.30కు తిరుపతి చేరుకుంటుందని తెలిపారు. 
 
అలాగే, తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి 07510 నంబరు రైలు ఈనెల 17, 24, 31 తేదీల్లో రాత్రి 11.50 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం డోన్‌కు 6.10కు, కర్నూలుకు 6.50 నిమిషాలకు చేరుకుటుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుందని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లికి నిరాకరించిందనీ యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది