పంది మాంసం కాల్చుకుని తింటే ఆ రుచేవేరబ్బా : రష్మిక మందన్నా

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (10:59 IST)
కన్నడసీమ నుంచి తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన హీరోయిన్ రష్మిక మందన్నా (RashmikaMandanna). ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్నారు. అయితే, ఈ అమ్మడు తీసుకునే ఆహార పదార్థాల గురించి తాజాగా వ్యాఖ్యానించింది. 
 
టాలీవుడ్ హీరో రాం చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న (Upasana) "యుఆర్ లైఫ్" (URLife) అనే వెబ్ సైట్ ద్వారా ప్రజలకు ఆరోగ్యం గురించి అవగాహణ కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్లను తీసుకొచ్చి ఆరోగ్యకరమైన వంట‌లు వండిస్తోంది. ఈ కార్యక్రమం కోసం తాజాగా రష్మిక మందన్నాతో వంటలు చేయించింది. 
 
ఈ సందర్భంగా ఆమెతో రష్మిక మాట్లాడుతూ తన ఆహార అలవాట్లను గురించి చెప్పింది. ‘కోలీ పుట్టు’ అనే కూరను ర‌ష్మిక వండింది. దీంతో ఆమెను ఉపాస‌న ప్రశంసిస్తూ పలు ప్రశ్నలు అడిగింది. మీరు కోర్గి సామాజిక వర్గానికి చెందినవారా? అని, పంది మాంసం అధికంగా తింటారు కదా? అని ప్రశ్నలు వేసింది.
 
దీనికి ఆమె సమాధానమిస్తూ, అవునని చెప్పింది. తాము ఇంట్లోనే వైన్ తయారు చేసుకుంటామని, అలాగే పంది మాంసం తింటామని, ఆ మాంసాన్ని కాల్చుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుందని చెప్పింది. పంది మాంసం, వైన్‌తో రకరకాల వంట‌లు చేసుకుంటామ‌ని తెలిపింది. ఇకపోతే, నిద్ర పోయే ముందుకు రెండు క‌ప్పుల వైన్ తాగితే  హాయిగా నిద్ర ప‌డుతుంద‌ని చెప్పుకొచ్చింది. అంటే, రష్మిక మందన్నా బ్యూటీ సీక్రెట్ ఇదేనన్నమాట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

మా డాడీ పొలిటికల్ కెరీర్ చివరి దశలో ఉంది : సీఎం సిద్ధరామయ్య కుమారుడు

తునిలో బాలికపై లైంగిక వేధింపుల కేసు: ఆ వ్యక్తికి ఏ పార్టీతో సంబంధంలేదు, అలా రాస్తే చర్యలు (video)

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రచారం.. ఎవరి కోసం?

భారత్‌లో పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments