Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బా.. చైనా ఏం చెప్పింది.. ఇండియా నుంచి కరోనా వచ్చి వుండొచ్చట!

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (13:20 IST)
చైనా కరోనా వైరస్‌కు భారత్ కూడా కారణమై వుండవచ్చునని పేర్కొంది. తద్వారా డ్రాగన్ కంట్రీ మరోసారి తన వక్ర బుద్ధిని చాటుకుంది. కరోనా వైరస్‌కు ఇండియా కూడా కారణం కావచ్చని అక్కడి అధికార మీడియా నిరాధార ఆరోపణలు చేస్తోంది. వైరస్ మొదట చైనాలో కనిపించినంత మాత్రాన అది ఇక్కడి నుంచే మొదలైందని ఎలా ఆరోపిస్తారని విమర్శిస్తోంది. 
 
విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆహార ఉత్పత్తుల నుంచే వుహాన్‌కు కరోనా వైరస్ వచ్చిందని వాదిస్తోంది. ఇందులో ఇండియా నుంచి వచ్చిన ఒక చేపల కన్‌సైన్‌మెంట్ కూడా ఉన్నదని, అందులోనూ కరోనా వైరస్ జాడలు కనిపించినట్లు చెబుతోంది. ఈ వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దర్యాప్తు మొదలుపెట్టనున్న సమయంలో చైనా ఇలాంటి ఆరోపణలు చేస్తుండటం గమనార్హం. 
 
అసలు కరోనా వైరస్ వుహాన్‌లో కనిపించిందా లేక అక్కడే పుట్టిందా అన్న అంశంపై డబ్ల్యూహెచ్‌వో విచారణ చేపట్టనుంది. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ కూడా ఇలాంటి ప్రకటనలే చేస్తున్నారు. చైనాలో కనిపించినంత మాత్రాన వైరస్ ఇక్కడే పుట్టిందని ఎలా చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు. వైరస్ ఎక్కడ పుట్టిందో తెలుసుకోవడం ఒక సంక్లిష్టమైన శాస్త్రీయ ప్రక్రియ అని అన్నారు. త్వరలోనే డబ్ల్యూహెచ్‌వో తన విచారణ మొదలుపెట్టనుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments