Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే 72 గంటలు అత్యంత కీలకం.. ఏమైనా జరగొచ్చు : పాకిస్థాన్

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (15:07 IST)
భారత వైమానిక దళం దాడులను పాకిస్థాన్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. ఈ దాడులకు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది. ఈనేపథ్యంలో సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఫలితంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం తప్పదంటూ వార్తలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రైల్వే మంత్రి ఖాజా రఫీ అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 72 గంటలు అత్యంత కీలకమన్నారు. ఈ సమయంలో ఏమైనా జరగొచ్చన్నారు. ఒకటి యుద్ధమా? లేదా శాంతి? అనేది 72 గంటల్లో తేలుతుందన్నారు. 
 
ఒకవేళ భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే.. రెండో ప్రపంచ యుద్ధం కన్నా భీకరంగా ఉంటుందని ఈ పాక్ మంత్రి అన్నాడు. పైగా, భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధమంటూ జరిగితే ఇదే చివరి యుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. 
 
కాగా, మంగళవారం తెల్లవారుజామున 12 యుద్ధవిమానాలతో జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై వెయ్యి కేజీల ఆర్డీఎక్స్‌ను వేయడంతో.. క్షణాల్లో ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ మెరుపు దాడుల్లో 300 మంది పైగా జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో పాకిస్థాన్ ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments