Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యా చంద్రయాన్ ప్రయోగం.. ఇస్రో కంటే ముందుగానే జాబిల్లిపై ల్యాండింగ్

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2023 (11:13 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సాఫీగా సాగిపోతుంది. ఇపుడు రష్యా కూడా ఇలాంటి ప్రయోగం చేపట్టింది. చంద్రమండలంపై దక్షిణ ధృవపు రహస్యాలను తెలుసుకునేందుకు వీలుగా లూనా-25 పేరుతో రష్యా చంద్రుడిపైకి రాకెట్‌ను ప్రయోగించింది. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు వాస్టోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి ఆకాశంలోకి దూసుకెళ్లింది. ఈ ల్యాండర్ భారత్ ప్రయోగించిన ల్యాండర్ కంటే రెండు రోజులు ముందుగానే ల్యాండింగ్ కావొచ్చని అంచనా వేస్తున్నారు. 
 
రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రాస్‌కాస్మొనాస్ ప్రకటన ప్రకారం మరో ఐదు రోజుల్లో ఈ వ్యోమనౌక నిర్దేశిత చంద్రుడి కక్ష్యలోకి చేరుకుంటుంది. ఆత ర్వాత జాబిల్లి దక్షిణ ధృవంపై దిగేందుకు అనువైన ప్రదేశం కోసం కొన్ని రోజుల పాటు అన్వేషించిన తర్వాత చంద్రుడిపై దిగుతుంది. ఆగస్టు 21వ తేదీన ఈ వ్యోమనౌక చంద్రుడిపై దిగే అవకాశం ఉందని రాస్‌కాస్మొనాస్ నిపుణులు పేర్కొంటున్నారు. అంతా సవ్యంగా జరిగితే యేడాది పాటు ఈ వ్యోమనౌక చంద్రుడిపై ప్రయోగాలు చేపడుతుంది. 
 
జాబిల్లిపై మట్టిని సేకరించి పరీక్షిస్తుంది. అనేక దీర్ఘకాలిక పరిశోధనలు కూడా చేపడుతుందని రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ తెలిపింది. సోవియట్ యూనియన్ అనంతర కాలంలో రష్యా ఇలాంటి ప్రయత్నం చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రష్యా అంతరిక్ష రంగానికి కొత్త ఊపు ఇవ్వడంతో పాటు ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఒంటరవుతున్న దేశంలో ఓ కొత్త ఉత్సాహం నింపేందుకు ఈ ప్రయోగం జరుగుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం