Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో మరిన్ని ఉగ్రవాద దాడులు : అమెరికా వార్నింగ్

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (09:27 IST)
ఈస్టర్ సండే రోజున జరిగిన ఎనిమిది వరుస పేలుళ్ళలో శ్రీలంక రాజధాని కొలంబో దద్ధరిల్లిపోయింది. ఐసిస్ తీవ్రవాద సంస్థ మానవబాంబులతో మారణహోమం సృష్టించింది. ఈ దాడులో దాదాపు 400 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దీంతో శ్రీలంకలో అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ)ని విధించి ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ వారంలో కూడా శ్రీలంకలో మరిన్ని దాడులు జరగొచ్చని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి. అందువల్ల ఉగ్రదాడులపట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీలంకను హెచ్చరించింది. ఈ వారంలో అంటే ఏప్రిల్ 26 నుంచి 28వ తేదీ ఆదివారంలోపు కొలోంబోలోని ప్రార్థనాస్థలాలకు ప్రజలు వెళ్లవద్దని అమెరికా రాయబార కార్యాలయ అధికారులు ట్విట్టర్‌లో హెచ్చరించారు. ఎక్కువ మంది జనం గుమిగూడవద్దని కూడా అమెరికా రాయబార కార్యాలయం కోరింది.
 
దీంతో శ్రీలంక భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అనుమానాస్పద వ్యక్తుల కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు, దేశంలో పోలీసు బందోబస్తును పెంచడంతోపాటు అనుమానితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టామని శ్రీలంక ప్రధానమంత్రి రాణిల్ విక్రమ్ సింఘే చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments