Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీలైనంత త్వరగా భారతదేశాన్ని విడిచిపెట్టి వచ్చేయండి: పౌరులకు అమెరికా హెచ్చరిక

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (13:38 IST)
భారతదేశంలో పెరుగుతున్న కోవిడ్ -19 సంక్షోభం కారణంగా వీలైనంత త్వరగా భారతదేశాన్ని విడిచిపెట్టమని యుఎస్ ప్రభుత్వం తన పౌరులకు తెలిపింది. లెవల్ 4 ట్రావెల్ అడ్వైజరీలో ఈ మేరకు అమెరికా ప్రకటన చేసింది. "భారతదేశానికి వెళ్లవద్దు, అలాగే అక్కడ వున్నవారు సాధ్యమైనంత త్వరగా వచ్చేయండి" అని పేర్కొంది.
 
భారతదేశం, యు.ఎస్, యూరప్ ద్వారా అనుసంధానించే ఇతర సేవల మధ్య 14 ప్రత్యక్ష రోజువారీ విమానాలు ఉన్నాయని డిపార్టుమెంట్ తెలిపింది. రికార్డు స్థాయిలో కోవిడ్ -19 కేసులు, మరణాలు దేశంలో సంభవిస్తున్నాయి. భారతదేశంలో గురువారం భారీగా 379,257 కేసులు, 3,645 మంది మరణించినట్లు నివేదించింది, తద్వారా ఇది ఇప్పటివరకు అతిపెద్ద సింగిల్-డే స్పైక్ అని ఎమ్‌హెచ్‌ఎఫ్‌డబ్ల్యూ తెలిపింది. దీనితో కరోనా కారణంగా ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 204,812 కు చేరుకుంది. భారతదేశంలో ఇప్పుడు దాదాపు 3.1 మిలియన్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారతదేశం ఇప్పుడు వారానికి సగటున 3,00,000 కేసులను నివేదిస్తోంది. 
 
కాగా ఆస్ట్రేలియా ఈ వారం ప్రారంభంలో భారతదేశం నుండి అన్ని విమానాలను నిషేధించింది. గత 10 రోజులలో భారతదేశంలో ఉన్న ఏ సందర్శకుడైనా ప్రవేశించకుండా ఇంగ్లాండ్ నిషేధించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments