Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో కరోనా పంజా.. 24 గంటల్లో 6,551 కేసులు.. 43 మంది మృతి

తెలంగాణలో కరోనా పంజా.. 24 గంటల్లో 6,551 కేసులు.. 43 మంది మృతి
, సోమవారం, 26 ఏప్రియల్ 2021 (10:07 IST)
తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో 6,551 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. రోజువారీ కేసులు కాస్త తగ్గగా.. మరణాలు పెరిగాయి. రాష్ట్రంలో వైరస్‌ ప్రభావంతో 43 మంది మృతి చెందినట్లు పేర్కొంది. 
 
నిన్న ఒకే వైరస్‌ నుంచి కోలుకొని 3,804 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న కేసులతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 65వేలు దాటింది. ప్రస్తుతం 65,597 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న రాష్ట్రంలో 73,275 కరోనా టెస్టులు చేసినట్లు వివరించింది.
 
కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,01,783కు పెరగ్గా.. ఇప్పటి వరకు 3,34,144 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి 2,042 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో 1,418, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 554, రంగారెడ్డిలో 482, నిజామాబాద్‌లో 388, సంగారెడ్డిలో 368, వరంగల్‌ అర్బన్‌లో 329, జగిత్యాలలో 276, కరీంనగర్‌లో 222, మహబూబ్‌నగర్‌లో 226, సిద్దిపేటలో 268 అత్యధికంగా కరోనా కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ వివరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భయం భయం... దేశంపై కరోనా పంజా : కొత్తగా 3.50 లక్షల కేసులు