Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా దూకుడు సరికాదు : భారత్‌కు అమెరికా మద్దతు

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (12:00 IST)
భారత సరిహద్దులతో పాటు జపాన్ ఆధీనంలో ఉండే సముద్ర జలాలపై చైనా చెలాయిస్తున్న ఆధిపత్యం, ప్రదర్శిస్తున్న దూకుడు ఏమాత్రం సరికాదని అగ్రరాజ్యం అమెరికా అభిప్రాయపడింది. అదేసమయంలో గాల్వాన్ లోయలో చైనా సైనికుల తీరును అమెరికా సెనెటర్లు ముక్తకంఠంతో ఖండించారు. 
 
తూర్పు లడఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద భారత్‌ - చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై అమెరికా నుంచి భారత్‌కు మద్దతు పెరుగుతోంది. చైనా చర్యలను పలు వేదికలపై అమెరికా చట్టసభ ప్రతినిధులు ఖండిస్తూ భారత్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
 
అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా చైనా చర్యలు ఉన్నాయని అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్‌ సంధూతో అమెరికాలోని రిపబ్లికన్‌ పార్టీకి చెందిన సీనియర్‌ సెనేటర్‌ మార్కో రూబియో వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తాము భారత్‌కు మద్దతుగా నిలుస్తామన్నారు. చైనా చర్యలను తిప్పికొట్టే సమర్థత భారత్‌కు ఉందని ఇటీవల గాల్వన్ ఘర్షణ ద్వారా తేలిందని చెప్పారు.
 
ఇదేవిషయంపై సెనేట్‌లో మిచ్‌ మెక్‌కన్నెల్‌ మాట్లాడారు. ఇండియా విషయంలో చైనా దూకుడును కనబరుస్తోందని విమర్శించారు. సెనేటర్‌ టామ్‌ కాటన్ మాట్లాడుతూ.. భారత సరిహద్దులతో పాటు జపాన్‌ అధీనంలో ఉండే సముద్ర జలాలపై చైనా ప్రదర్శిస్తోన్న తీరు సరికాదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments