Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యక్ష ప్రసారం అవుతుండగా కరోనా టీకా తీసుకున్న జో బైడెన్

Joe Biden
Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (08:34 IST)
అమెరికా దేశానికి కాబోయే కొత్త అధ్యక్షుడు జో బైడెన్ కరోనా టీకా వేయించుకున్నారు. అదీకూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుండగా ఆయన ఈ వ్యాక్సిన్ వేయించుకున్నారు. తన స్వస్థలమైన డెలావర్‌లో వ్యాక్సిన్ వేయించుకున్నారు. 
 
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, వ్యాక్సిన్ వల్ల భయపడడానికి ఏమీ లేదన్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నిపుణుల సూచనలు పాటించాలని అన్నారు. 
 
వైరస్ నుంచి బయటపడడానికి ఇది ఆరంభం మాత్రమేనని, మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడేందుకు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందని బైడెన్ పేర్కొన్నారు.
 
కాగా, గతవారం అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ దంపతులు కూడా వ్యాక్సిన్ షాట్ తీసుకున్నారు. అయితే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మొదటి మహిళ మెలానియా ట్రంప్ మాత్రం ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోలేదు. 
 
అమెరికాలో ఇటీవలే ఫైజర్ టీకా అందుబాటులోకి వచ్చింది. యూఎస్ రెగ్యులేటరీ ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వడంతో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments