Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికన్లకు స్వర్ణయుగం రాబోతుంది : డోనాల్డ్ ట్రంప్ విజయోత్సవ స్పీచ్

ఠాగూర్
బుధవారం, 6 నవంబరు 2024 (14:42 IST)
అమెరికన్లకు స్వర్ణ యుగం రాబోతుందని ఆ దేశానికి కాబోయే కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. బుధవారం వెలువడుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ వీడింది. అమెరికా పౌరులు ఎలాంటి గందరగోళం లేకుండా స్పష్టమైన తీర్పునిచ్చారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు కలిగిన అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలంటే 270 ఓట్లు ఖచ్చితంగా సాధించాల్సివుంది. ఇపుడు రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేసిన డోనాల్డ్ ట్రంప్ 277 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలుపు లాంఛన ప్రాయంగా మారనుంది. దీంతో ఆయన అమెరికాకు 47వ అధ్యక్షుడుగా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. 
 
ఈ విజయాన్ని పురస్కరించుకుని ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమెరికన్లకు స్వర్ణయుగం రాబోతుందన్నారు. ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు ఎంతగానో శ్రమించారన్నారు. రిపబ్లికన్ పార్టీకి 300పైగా సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ఎన్నికల్లో ఘన విజయం అందించిన అమెరికా పౌరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments