Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికన్లకు స్వర్ణయుగం రాబోతుంది : డోనాల్డ్ ట్రంప్ విజయోత్సవ స్పీచ్

ఠాగూర్
బుధవారం, 6 నవంబరు 2024 (14:42 IST)
అమెరికన్లకు స్వర్ణ యుగం రాబోతుందని ఆ దేశానికి కాబోయే కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. బుధవారం వెలువడుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ వీడింది. అమెరికా పౌరులు ఎలాంటి గందరగోళం లేకుండా స్పష్టమైన తీర్పునిచ్చారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు కలిగిన అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలంటే 270 ఓట్లు ఖచ్చితంగా సాధించాల్సివుంది. ఇపుడు రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేసిన డోనాల్డ్ ట్రంప్ 277 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలుపు లాంఛన ప్రాయంగా మారనుంది. దీంతో ఆయన అమెరికాకు 47వ అధ్యక్షుడుగా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. 
 
ఈ విజయాన్ని పురస్కరించుకుని ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమెరికన్లకు స్వర్ణయుగం రాబోతుందన్నారు. ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు ఎంతగానో శ్రమించారన్నారు. రిపబ్లికన్ పార్టీకి 300పైగా సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ఎన్నికల్లో ఘన విజయం అందించిన అమెరికా పౌరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments