Webdunia - Bharat's app for daily news and videos

Install App

నావికా తుపాకులను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా రెడీ

Webdunia
గురువారం, 21 నవంబరు 2019 (11:56 IST)
సుమారు 1 బిలియన్​ డాలర్లు (7వేల కోట్ల రూపాయలు) విలువచేసే నావికా తుపాకులను భారత్​కు విక్రయించడానికి నిర్ణయించింది అమెరికా. ఈ మేరకు అగ్రరాజ్య కాంగ్రెస్​కు తన నిర్ణయాన్ని నోటిఫికేషన్​ ద్వారా వెల్లడించింది డొనాల్డ్​ ట్రంప్​ ప్రభుత్వం. ఈ ఆయుధాల వల్ల భారత నావికాదళం మరింత బలపడనుంది. 
 
శత్రువులకు చెందిన యుద్ధనౌకలు, విమానాలతో పోరాడటానికి ఈ నేవెల్​ గన్​లను ఉపయోగించవచ్చు. వీటితో దేశ భద్రత మరింత మెరుగుపడుతుంది. ప్రతిపాదిత 13 ఎమ్​కే-45 5 ఇంచ్​/62 కాలిబర్​(ఎమ్​ఓడీ 4) నావికా తుపాకులు, సంబంధిత పరికరాల వ్యయం దాదాపు 1.02 బిలియన్​ డాలర్లని అగ్రరాజ్య రక్షణ-భద్రతా సహకార సంస్థ తెలిపింది.
 
ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, జపాన్​, దక్షిణ కొరియాలకు మాత్రమే ఎమ్​ఓడీ 4ను విక్రయించింది అమెరికా. తాజాగా ఈ జాబితాలోకి భారత్​ చేరింది. మరిన్ని మిత్ర దేశాలకు ఈ నావికా తుపాకులను అమ్మడానికి సిద్ధపడుతోంది అగ్రరాజ్యం.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments