Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెన్నుపోటు చైనా.. భారత్‌కు మద్దతు ప్రకటించిన అమెరికా

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (16:52 IST)
లడాఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులను చర్చల పేరుతో పిలిచి అతి కిరాతకంగా చంపడంపై అమెరికా తీవ్రంగా మండిపడింది. చైనా చర్యను వెన్నుపోటుగా అభివర్ణించింది. పైగా, ఇలాంటి సమయంలో భారత్‌కు అండగా ఉంటామని భరోసానిచ్చింది. 
 
భారత్ - చైనా దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఘర్షణలపై అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో స్పందించారు. చైనా వెన్నుపోటుకు భారత్ గురైందన్నారు. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వద్ద చైనా దుడుకు వైఖరి కారణంగానే పరిస్థితి దిగజారిందని ఆయన అభిప్రాయపడ్డారు. చైనా తన పొరుగు దేశాల విషయంలో దుడుకు వైఖరి అవలంబిస్తోందని, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తోందని ఆయన ఆరోపించారు. 
 
'అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌తో సరిహద్దు వివాదం ముదిరేలా చేసింది చైనా ఆర్మీయే. దక్షిణ చైనా సముద్రంలో మిలటరీ దళాలను మోహరిస్తూ చట్టవ్యతిరేకంగా ఆయా ప్రాంతాలను తన ఆధీనంలో తెచ్చుకుంటోంది. సముద్ర రావాణా మార్గాల్లో అశాంతిని సృష్టిస్తోంది' అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో తాము భారత్‌కు అండగా ఉంటామని ఆయన ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments