Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిజ్జా బాగోలేదనీ... యజమాని మొహంపై పడేసిన మహిళ

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (10:15 IST)
బాగా ఆకలి అవుతుండటంతో పిజ్జా తిందామని దగ్గర్లోని షాపుకెళ్లి పిజ్జాను ఆర్డరిచ్చిందో ఓ మహిళ. తీరా ఆ పిజ్జా ఆరగించబోయే సమయానికి అది చెడిపోయివుంది. ఇదేంటని షాపు యజమానిని నిలదీస్తే.. అతని దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఆ పిజ్జాను యజమాని మొహంపై పడేసిందా మహిళ. దీనిపై ఆ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 
 
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫ్లోరిడాకు చెందిన 28 ఏళ్ల సైదా సలీమ్ అనే మహిళ తన కుమారుడుతో కలిసి ఓషాపుకెళ్లి మార్గరెటా పిజ్జా ఆర్డరిచ్చింది. కానీ, షాపు సిబ్బంది ఆమె కోరిన పిజ్జాను సర్వే చేయకుండా సాధారణ పిజ్జాను సర్వ్ చేశారు. పైగా, అది చెడిపోయివుంది. 
 
దాన్ని చూసి సైదా.. ఇదేంటని ప్రశ్నించింది. సిబ్బంది నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో యజమానిని నిలదీసింది. ఆయన వద్ద నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పిజ్జాను ఆయన మొహంపై విసిరేసింది. ఈ సంఘటనపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫలితంగా పోలీసులు కేసు నమోదు చేసి ఆ మహిళను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Latha Mangeshkar: లతా మంగేష్కర్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. ఐదేళ్లలోనే ఆమె ప్రతిభ అలా..?

Tamannaah Bhatia- తమన్నా భాటియా విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసిందా?

తలసేమియా భాదితుల కోసం తమన్ మ్యూజికల్ నైట్ : నారా భువనేశ్వరి

సిద్ధార్థ్, శ్రీ గణేష్, శరత్‌కుమార్, దేవయాని మూవీ టైటిల్ 3 BHK

బాలకృష్ణ గారు నాకు సపోర్ట్ చేయడాన్ని గొళ్ళెం వేయకండి : విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments