Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ వెళ్ళాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్...

Webdunia
శుక్రవారం, 14 జులై 2023 (10:40 IST)
భారతీయ సంతతికి చెందిన బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ భారతీయ యువతకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఇకపై యూకే వెళ్ళాలని భావించే వారి నుంచి వీసా ఖర్చులు భారీగా వసూలు చేయనున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించడం గమనార్హం.
 
వైద్య ఖర్చుల కోసం వీసాదారులు చెల్లించే హెల్త్ సర్ చార్జ్ ఇతర ఫీజులు పెరుగుతాయని ఆయన గురువారం స్పష్టం చేశారు. దేశంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది జీతాలు పెంచనున్న నేపథ్యంలో వీసాకు సంబంధించిన వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయని అన్నారు.
 
టీచర్లు, పోలీసులు, జూనియర్ డాక్టర్లతో పాటు ఇతర ప్రభుత్వ సిబ్బంది వేతనాలు పెంచాలంటూ ఇటీవల బ్రిటన్‌లోని ఓ స్వతంత్ర కమిటీ సూచించింది. ఈ ప్రతిపాదనలకు ఆమోదించాలని బ్రిటన్ ప్రధానిపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రభుత్వ సిబ్బంది సగటు వేతనాలు 5 నుంచి 7 శాతం మేర పెరుగుతుందని చెప్పుకొచ్చారు. అయితే, ఈ ఖర్చులకు అప్పుల చేసి నిధులు సమీకరించబోమని ఆయన స్పష్టంచేశారు. భవిష్యత్తులో ద్రవ్యోల్బణం పరిగే అవకాశం ఉన్నందున ఇలాంటి చర్యకు పూనుకోమని స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments