Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఇద్దరు సిక్కులను కాల్చివేత

Webdunia
సోమవారం, 16 మే 2022 (12:41 IST)
దాయాది దేశమైన పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ఇద్దరు సిక్కు పౌరులను కాల్చి చంపేశారు. ఈ దారుణం పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలో ఆదివారం ఉదయం జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
ఇద్దురు గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వచ్చి సల్జీత్ సింగ్ (42), రంజిత్ సింగ్ (38) అనే ఇద్దురు సిక్కు వ్యాపారులను కాల్చి చంపేశారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వ్యాపారులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
కాగా, ఈ సిక్కు వ్యాపారుల హత్యను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ ఖండించారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను ఆదేశించారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రగా ఈ ఘటనను ఆయన అభినందించారు. కాగా, పెషావర్‌లో దాదాపు 15 వేల మంది వరకు సిక్కులు నివసిస్తున్నారు. వారిలో అత్యధికులు వ్యాపారులో కావడం గమనార్హం. 
 
ఈ వ్యాపారులపై దాడులు సర్వసాధారణంగా మారిపోయాయి. గత యేడాది సెప్టెంబరులో యునానీ వైద్యుడు హుకీం, అంతకుముందు యేడాది ఓ టీవీ చానల్‌లో యాంకర్‌గా పని చేస్తున్న రవీందర్ సింగ్‌, 2018లో ప్రముఖ సిక్కు నేత చరణ్ జీత్ సింగ్, 2016లో జాతీయ అసెంబ్లీ సభ్యుడు సోరెన్ సింగ్‌ను దుండగులు కాల్చి చంపిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments