Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఇద్దరు సిక్కులను కాల్చివేత

Webdunia
సోమవారం, 16 మే 2022 (12:41 IST)
దాయాది దేశమైన పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ఇద్దరు సిక్కు పౌరులను కాల్చి చంపేశారు. ఈ దారుణం పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలో ఆదివారం ఉదయం జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
ఇద్దురు గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వచ్చి సల్జీత్ సింగ్ (42), రంజిత్ సింగ్ (38) అనే ఇద్దురు సిక్కు వ్యాపారులను కాల్చి చంపేశారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వ్యాపారులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
కాగా, ఈ సిక్కు వ్యాపారుల హత్యను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ ఖండించారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను ఆదేశించారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రగా ఈ ఘటనను ఆయన అభినందించారు. కాగా, పెషావర్‌లో దాదాపు 15 వేల మంది వరకు సిక్కులు నివసిస్తున్నారు. వారిలో అత్యధికులు వ్యాపారులో కావడం గమనార్హం. 
 
ఈ వ్యాపారులపై దాడులు సర్వసాధారణంగా మారిపోయాయి. గత యేడాది సెప్టెంబరులో యునానీ వైద్యుడు హుకీం, అంతకుముందు యేడాది ఓ టీవీ చానల్‌లో యాంకర్‌గా పని చేస్తున్న రవీందర్ సింగ్‌, 2018లో ప్రముఖ సిక్కు నేత చరణ్ జీత్ సింగ్, 2016లో జాతీయ అసెంబ్లీ సభ్యుడు సోరెన్ సింగ్‌ను దుండగులు కాల్చి చంపిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments