Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్‌లో భారీ పేలుళ్లు.. 100 మందికి పైగా మృతి

Webdunia
బుధవారం, 3 జనవరి 2024 (20:00 IST)
ఇరాన్‌ సైనిక ఉన్నతాధికారి ఖాసీం సులేమానీ సంస్మరణ కార్యక్రమంలో పెను విషాదం చోటుచేసుకుంది. కెర్మాన్‌లోని ఆయన సమాధి సమీపంలో సంభవించిన జంట పేలుళ్లలో వంద మందికి పైగా మృతి చెందారు. మరో 170 మందికిపైగా గాయపడినట్లు అధికారిక మీడియా తెలిపింది. ఇజ్రాయెల్‌ - హమాస్‌ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ పేలుళ్లు జరిగాయి. గాజాపై దాడులను ఇరాన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
 
ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌లోని అత్యంత శక్తిమంతమైన ఖుద్స్‌ ఫోర్స్‌కు నేతృత్వం వహించిన ఖాసీం సులేమానీ.. 2020 జనవరి 3న అమెరికా డ్రోన్‌ దాడిలో మృతి చెందారు. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ దాడికి అప్పటి అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఆదేశాలు ఇచ్చారు. 
 
దానిపై అప్పట్లో ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. తాజాగా సులేమానీ నాలుగో వర్థంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పేలుళ్లు సంభవించాయి. ఇదిలావుంటే, 2020లో ఆయన అంత్యక్రియల సమయంలోనూ తొక్కిసలాట జరిగి 56 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఇపుడు జరిగిన జంట పేలుళ్ళలో వంద మంది వరకు చనిపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

ఫస్ట్ టైమ్ హరుడు తో మాస్ చిత్రం చేశా : హీరో వెంకట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments