Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీసా మోసం కేసులో దోషులుగా ముగ్గురు భారతీయులు...

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (10:31 IST)
అమెరికాలో హెచ్1బీ వీసాల మోసం కేసులో ముగ్గురు భారతీయులకు జైలుశిక్షకు గురయ్యారు. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, శాంతా క్లారాలో నివిసించే కిషోర్ ద‌త్త‌పురం, టెక్సాస్‌లో నివసించే కుమార్ అశ్వ‌ప‌తి, శాన్ జోస్‌కు చెందిన సంతోష్ గిరిలు నానోసిమాంటిక్స్ కంపెనీ పేరుతో ఓ క‌న్స‌ల్టెన్సీ నడిపిస్తున్నారు.
 
వ‌ర్క‌ర్ల కోసం నకిలీ హెచ్‌-1బీ వీసాల‌ను వీళ్లు జారీ చేశారు. ఉద్యోగాలు లేని వాళ్లకు కూడా వీళ్లు వీసాల‌ను ఇచ్చారు. అయితే వీసా దరఖాస్తులో భాగంగా ఐ-129 అనే పిటిషన్‌‌ను అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్‌ విభాగానికి సమర్పించాల్సి ఉంటుంది. అందులో అభ్యర్థి చేయబోయే ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలి.
 
అయితే ఈ ముగ్గురు భారతీయులులేని ఉద్యోగాల్ని ఉన్నట్లుగా చూపించి లాభం పొందాలని చూశారని అక్కడి పోలీసులు కోర్టుకు సమర్పించిన దస్త్రాల్లో పేర్కొన్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి థర్డ్‌ పార్టీలను కూడా వాళ్లు ఆశ్రయించినట్లు పోలీసులు కోర్టుకి తెలియజేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురు బెయిల్‌పై బయటకు వచ్చారు. తదుపరి విచారణ నిమిత్తం మే 13వ తేదీన కోర్టులో హాజరుకానున్నారు. ఈ కేసులో దోషులుగా తేలితే పది సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశముంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments