Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 మంది భార్యలు... 102 మంది సంతానం... 578 మందికి తాతయ్య..

ఠాగూర్
గురువారం, 26 డిశెంబరు 2024 (16:57 IST)
12 మంది భార్యలు... 102 మంది సంతానం... 578 మందికి తాతయ్య.. ఇదేదో విచిత్రంగా ఉంది కదూ. నిజమే.. ఉగాండాకు చెందిన ఓ వ్యక్తికి ఇలా గుర్తింపు పొందాడు. ఆ వ్యక్తి పేరు ముసా హసహ్యా కసేరా. ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఉగాండా దేశానికి చెందిన వ్యక్తి. ఉగాండాలోని ముకిజా గ్రామ నివాసి. ఆయన వయసు 70 యేళ్లు. ఏకంగా 12 మందిని వివాహం చేసుకుని ఏకంగా 102 మందికి జన్మనిచ్చాడు. ఒక్కో భార్య నుంచి 8, 9 మంది పిల్లల్ని కన్నాడు. ఇప్పుడు తన సంతానాన్ని పెంచేందుకు, వారి కడుపు నింపేందుకు నానా పాట్లు పడుతున్నాడు. అంతేకాదండోయ్.. వారి పేర్లను గుర్తు పెట్టుకునేందుకు కూడా తికమక పడుతున్నారు. ఇందుకోసం ఏకంగా ఓ రిజిస్టర్‌నే నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈయన 578 మందికి తాతగా మారాడు. 
 
1972లో ముసా తొలి వివాహం చేసుకున్నాడు. అప్పటికి ఆయన వయసు 17 ఏళ్లే. అనంతరం ఒకరి తర్వాత ఒకరిగా మొత్తం 12 మందిని చేసుకున్నాడు. అయితే, ఇంతమందిని చేసుకుంటూ పోయినా వారిని ఎలా పోషించగలనన్న ఆలోచన తనకెప్పుడూ రాలేదని ముసా చెప్పుకొచ్చాడు. 'దిఇండోట్రెక్కర్' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోకు ఒక్క రోజులోనే 8.6 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kailash Meena (@theindotrekker)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments