Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నా యూనివర్శిటీ ప్రాంగణంలోనే విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

ఐవీఆర్
గురువారం, 26 డిశెంబరు 2024 (16:51 IST)
చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో దారుణం జరిగింది. యూనివర్శిటీలో చదువుతున్న ఓ విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాలు చూస్తే... చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని ఈ నెల 23వ తేదీ రాత్రి తన స్నేహితుడితో కలసి మాట్లాడుతూ వుంది. ఆ సమయంలో అటుగా ఇద్దరు వ్యక్తులు వచ్చారు.
 
వీరిని గమనించి దగ్గరకు వచ్చి విద్యార్థిని స్నేహితుడిపై దాడి చేసి అక్కడి నుంచి తరిమి వేసారు. అనంతరం విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటన అనంతరం ఆమెను అసభ్యంగా ఫోటోలు తీసి, తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించి వదిలేసారు.
 
మరుసటిరోజు ఉదయం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యూనివర్శిటీ ప్రాంగణంలోని సీసీ కెమేరాల ద్వారా నిందితులను గుర్తించారు. ఒకడు రోడ్డు పక్కనే బిర్యానీ అమ్ముకునే జ్ఞానశేఖరన్ అని తెలుసుకుని అతడిని అరెస్ట్ చేసారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments