Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నా యూనివర్శిటీ ప్రాంగణంలోనే విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

ఐవీఆర్
గురువారం, 26 డిశెంబరు 2024 (16:51 IST)
చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో దారుణం జరిగింది. యూనివర్శిటీలో చదువుతున్న ఓ విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాలు చూస్తే... చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని ఈ నెల 23వ తేదీ రాత్రి తన స్నేహితుడితో కలసి మాట్లాడుతూ వుంది. ఆ సమయంలో అటుగా ఇద్దరు వ్యక్తులు వచ్చారు.
 
వీరిని గమనించి దగ్గరకు వచ్చి విద్యార్థిని స్నేహితుడిపై దాడి చేసి అక్కడి నుంచి తరిమి వేసారు. అనంతరం విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటన అనంతరం ఆమెను అసభ్యంగా ఫోటోలు తీసి, తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించి వదిలేసారు.
 
మరుసటిరోజు ఉదయం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యూనివర్శిటీ ప్రాంగణంలోని సీసీ కెమేరాల ద్వారా నిందితులను గుర్తించారు. ఒకడు రోడ్డు పక్కనే బిర్యానీ అమ్ముకునే జ్ఞానశేఖరన్ అని తెలుసుకుని అతడిని అరెస్ట్ చేసారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments