Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల్ని కంటే ఐదేళ్ళలో రూ.5 లక్షలు ప్రోత్సాహక బహుమతి

Webdunia
ఆదివారం, 2 జులై 2023 (08:39 IST)
తమ వద్ద పని చేసే ఉద్యోగులకు ఓ చైనా కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారు చేయాల్సిందిల్లా ఒక్కటే. పిల్లల్ని కనడమే. ఇలా పిల్లల్ని కంటే తొలి ఐదేళ్లలో రూ.5 లక్షలు చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతిని అందిస్తామని ప్రకటించింది. ఈ పథకం లక్ష్యం.. చైనాలో ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ప్రోత్సహించడమే ఈ సరికొత్త పథక విధానం. భారతీయ కరెన్సీలో యేడాదికి రూ.1.1లక్షల చొప్పున ప్రోత్సాహక బహుమతిని అందిస్తారు. 
 
చైనాలో అతిపెద్ద ట్రావెల్ కంపెనీగా గుర్తింపు పొందిన ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ ట్రిప్ డాట్ కామ్. చైనాలో యువత సంఖ్య బాగా తగ్గిపోయింది. వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. దీంతో చైనా పాలకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అధిక సంఖ్యలో పిల్లల్ని కనాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇందులోభాగంగా, ఈ ఆన్‌లైన్ కంపెనీ కూడా తమ వద్ద పని చేసే ఉద్యోగులకు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది. 
 
కంపెనీలో పని చేసే ఉద్యోగులు పిల్లల్ని కంటే ఒక్కో శిశువుకు యేడాదికి 11000 యువాన్లు చొప్పున వార్షిక బోనస్‌గా ఐదేళ్లపాటు చెల్లిస్తామని పేర్కొంది. ఇది భారత కరెన్సీలో రూ.1.1 లక్షలు. ఆ లెక్కన ఒక శిశువుకు ఐదేళ్లలో రూ.5.6 లక్షల నగదును అందజేయనుంది. ఈ ఆఫర్‌ను జూన్ 30వతేదీన ప్రకటించగా, జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. తమ కంపెనీలో మూడేళ్లు అంతకంటే ఎక్కువ కాలంగా పని చేస్తున్న ఉద్యోగులకు ఈ కొత్త చైల్డ్ కేర్ బెనిఫిట్ ప్రయోజనం చేకూరనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments