Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసికందును మట్టిలో పాతిపెట్టారు.. శునకం కాపాడింది.. ఎలాగంటే?

Webdunia
శనివారం, 18 మే 2019 (11:52 IST)
థాయ్‌లాండ్‌‍లో కన్నతల్లి చేతులారా మట్టిలో పాతిపెట్టబడిన పసికందును ఓ శునకం రక్షించింది. తాను గర్భవతిని అయ్యానని.. 15 ఏళ్లలోనే పాపాయికి జన్మనిచ్చానని తెలిస్తే.. తల్లిదండ్రుల కోపానికి కారణమవుతానని జడుసుకున్న 15 ఏళ్ల యువతి.. తనకు పుట్టిన పసికందును ప్రాణాలతో మట్టిలో పాతిపెట్టింది.


థాయ్‌లాండ్‌లోని పెన్ నాంగ్ కామ్ అనే గ్రామంలో పింగ్ పాంగ్ అనే శునకం... పాపాయిని మట్టిలో పాతిపెట్టిన ప్రాంతాన్ని చూసి మొరగడం చేసింది. ఇంకా ఆ మట్టిని తవ్వింది. 
 
దీన్ని గమనించిన ఆ శునకం యజమాని.. ఆ మట్టి నుంచి శిశువు కాలు బయటికి రావడం చూసి షాకయ్యాడు. వెంటనే మట్టిలో పాతిపెట్టిన పసికందును చేతికి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ శిశువు పరీక్షించిన వైద్యులు పాపాయి ఆరోగ్యంగా వుందని.. చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇక పింగ్ పాంగ్ అనే శునకం యజమాని పట్ల విశ్వాసంతో నడుచుకుంటుంది. 
 
కానీ ఇటీవల ఓ కారు ప్రమాదంలో పింగ్ పాంగ్ ఓ కాలు పని చేయకుండా పోయిందని శునకం యజమాని తెలిపారు. ఆ గ్రామంలో వున్న వారందరికీ పింగ్ పాంగ్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఇక పింగ్ పాంగ్ కనిపెట్టిన ఆ శిశువు తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ శిశువును ఆ యువతి తల్లిదండ్రులే పెంచాలని నిర్ణయించుకున్నారని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments