Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసికందును మట్టిలో పాతిపెట్టారు.. శునకం కాపాడింది.. ఎలాగంటే?

Webdunia
శనివారం, 18 మే 2019 (11:52 IST)
థాయ్‌లాండ్‌‍లో కన్నతల్లి చేతులారా మట్టిలో పాతిపెట్టబడిన పసికందును ఓ శునకం రక్షించింది. తాను గర్భవతిని అయ్యానని.. 15 ఏళ్లలోనే పాపాయికి జన్మనిచ్చానని తెలిస్తే.. తల్లిదండ్రుల కోపానికి కారణమవుతానని జడుసుకున్న 15 ఏళ్ల యువతి.. తనకు పుట్టిన పసికందును ప్రాణాలతో మట్టిలో పాతిపెట్టింది.


థాయ్‌లాండ్‌లోని పెన్ నాంగ్ కామ్ అనే గ్రామంలో పింగ్ పాంగ్ అనే శునకం... పాపాయిని మట్టిలో పాతిపెట్టిన ప్రాంతాన్ని చూసి మొరగడం చేసింది. ఇంకా ఆ మట్టిని తవ్వింది. 
 
దీన్ని గమనించిన ఆ శునకం యజమాని.. ఆ మట్టి నుంచి శిశువు కాలు బయటికి రావడం చూసి షాకయ్యాడు. వెంటనే మట్టిలో పాతిపెట్టిన పసికందును చేతికి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ శిశువు పరీక్షించిన వైద్యులు పాపాయి ఆరోగ్యంగా వుందని.. చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇక పింగ్ పాంగ్ అనే శునకం యజమాని పట్ల విశ్వాసంతో నడుచుకుంటుంది. 
 
కానీ ఇటీవల ఓ కారు ప్రమాదంలో పింగ్ పాంగ్ ఓ కాలు పని చేయకుండా పోయిందని శునకం యజమాని తెలిపారు. ఆ గ్రామంలో వున్న వారందరికీ పింగ్ పాంగ్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఇక పింగ్ పాంగ్ కనిపెట్టిన ఆ శిశువు తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ శిశువును ఆ యువతి తల్లిదండ్రులే పెంచాలని నిర్ణయించుకున్నారని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments