Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండోసారి పాజిటివ్ వచ్చిన వారి నుంచి కరోనా సోకదు

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (19:44 IST)
రెండవసారి పాజిటివ్‌ వచ్చినప్పటికి వారిలో ఎలాంటి రోగ లక్షణాలు కనిపించవని, వారినుంచి వైరస్‌ ఇతరులకు సోకే ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. కరోనా బారినుంచి కోలుకున్న వ్యక్తులకు మరో సారి పాజిటివ్‌ రావటానికి కారణం వారి శరీరంలోని మృత  వైరస్‌లేనని అన్నారు.

ఇటీవల హాంకాంగ్‌లో 33 ఏళ్ల వ్యక్తికి థెర్మల్‌ స్క్రీనింగ్‌లో కరోనా రెండవ సారి బయటపడిన సంగతి తెలిసిందే. దీంతో రెండవ సారి కరోనా సోకే విషయంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. 'క్లినికల్‌ ఇన్‌ఫెక్షస్‌ డీసీజెస్‌' జర్నల్‌లో ప్రచురించిన నివేదికలో శాస్త్రవేత్తలు దీనిపై క్లారిటీ ఇచ్చారు.

కరోనా సోకిన వ్యక్తి శరీరం వేగంగా న్యూట్రలైజింగ్‌ యాంటీ బాడీస్‌ను విడుదల చేస్తుందని, ఇన్‌ఫెక్షన్‌ తగ్గిన ఒకటి లేదా రెండు నెలల తర్వాత యాంటీ బాడీస్‌ సంఖ్య తగ్గిపోతుందని తెలిపారు.

శరీరంనుంచి వైరస్‌లను బయటకు పంపేసే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో 'రివర్స్‌ ట్రాన్స్క్రిప్షన్‌ పాలిమరేస్‌ చైన్‌ రియాక్షన్‌' టెస్టుల్లో కోలుకున్న వ్యక్తులకు కూడా కొన్ని వారాల తర్వాత పాజిటివ్‌ వస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments