Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌లో కరోనాకు మరో 92 మంది బలి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనాకు మరో 92 మంది బలి
, గురువారం, 27 ఆగస్టు 2020 (18:48 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడ‌చిన 24 గంటల్లో  కొత్తగా 10,621 కరోనా కేసులు నమోదయ్యాయి. 92 మంది మృతి చెందారు.

దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,93,090కి చేరింది. మొత్తం 61,300 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్ల‌డించింది.

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 94,209గా ఉంది. ఇప్పటివరకు 2,95,248మంది కరోనా నుంచి కోలుకోగా.. 3,633 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతి రైతులకు మద్ధతుగా రానున్న కువైట్ బృందం