Webdunia - Bharat's app for daily news and videos

Install App

పఠాన్ కోట్ తరహా దాడి.. భారత యుద్ధ నౌకల్ని పేల్చేందుకు పాక్ కుట్ర

భారత యుద్ధ నౌకలను పేల్చేందుకు పాకిస్థాన్ కుట్ర పన్నినట్లు ఇంటెలిజన్స్ వర్గాలు పసిగట్టాయి. ఈ విషయాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి చేరవేశాయి. దీంతో నేవీ దళాధికారులు అప్రమత్తమయ్యారు. పఠాన్ కోట్ తరహా దాడ

Webdunia
గురువారం, 19 జులై 2018 (13:27 IST)
భారత యుద్ధ నౌకలను పేల్చేందుకు పాకిస్థాన్ కుట్ర పన్నినట్లు ఇంటెలిజన్స్ వర్గాలు పసిగట్టాయి. ఈ విషయాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి చేరవేశాయి. దీంతో నేవీ దళాధికారులు అప్రమత్తమయ్యారు. పఠాన్ కోట్ తరహా దాడికి పాల్పడి, విశాఖ తీరంలో ఉన్న యుద్ధ నౌకలను, జలాంతర్గాములను ధ్వంసం చేయాలన్న లక్ష్యంతో జైషే మొహమ్మద్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. 
 
ఇందుకుగాను ఇప్పటికే పదిమంది ఉగ్రవాదులు డీప్ సీ డైవర్లుగా శిక్షణ పొందారని, వీరంతా ముజఫరాబాద్ సమీపంలో ఉన్న కెల్, దుధినిహల్, లీపా లోయల గుండా ఇండియాలో చొరబడవచ్చని ఇంటెలిజెన్స్ భావిస్తోంది. 
 
సముద్ర అంతర్భాగం ద్వారా జలాంతర్గాముల వద్దకు చేరుకుని.. వాటిని పేల్చే సాంకేతికత గురించి వారికి పూర్తి అవగాహన కూడా వుందని ఇంటలిజెన్స్ తెలిపింది. ఆధునిక ఆయుధ శిక్షణనూ వారు పూర్తి చేసుకున్నారని ఇంటెలిజెన్స్ సంస్థలను సమన్వయం చేసే మల్టీ ఏజెన్సీ సెంటర్ పేర్కొంది. నిఘా సంస్థలు హెచ్చరించడంతో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు భారత నేవీ అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments