Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థి.. రోడ్డు ప్రమాదంలో మృతి

సెల్వి
బుధవారం, 3 ఏప్రియల్ 2024 (10:10 IST)
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు ఆచంట రేవంత్ ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా పర్చూరు మండలం బోడవాడకు చెందినవాడు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన 22 ఏళ్ల రేవంత్‌ గత ఏడాది డిసెంబర్‌లో ఎంఎస్‌ చేసేందుకు అమెరికా వెళ్లినట్లు బంధువులు తెలిపారు. అతను ప్రస్తుతం మాడిసన్ ప్రాంతంలోని డకోటా స్టేట్ యూనివర్శిటీలో చదువుతున్నాడు.
 
సమాచారం ప్రకారం, మంగళవారం పుట్టినరోజు వేడుకల కోసం ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో వెళుతుండగా ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. 
 
ఈ ప్రమాదంలో రేవంత్‌తో పాటు ముగ్గురు స్నేహితులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే రేవంత్ మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. ఆయన మృతితో స్వగ్రామమైన బోడవాడ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 
 
రేవంత్ తల్లి కొన్నేళ్ల క్రితం మరణించగా, తండ్రి రఘుబాబు ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కుమారుడి అకాల మరణం ఆ తండ్రి హృదయాన్ని కలచివేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments