Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఎస్ కోసం చికాగో వెళ్లాడు.. పెట్రోల్ బంకులో పార్ట్‌టైమ్ చేశాడు.. కానీ..?

సెల్వి
ఆదివారం, 1 డిశెంబరు 2024 (12:44 IST)
శనివారం అమెరికాలోని చికాగోలోని పెట్రోల్ బంక్ వెలుపల తెలంగాణకు చెందిన 22 ఏళ్ల యువకుడిని దుండగుడు కాల్చి చంపాడు. మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన సాయి తేజ నూకారపు అని తెలిసింది.

ఇతను పెట్రోల్ పంపులో పని చేస్తున్నాడు. ఆ సమయంలో పెట్రోల్ బంకుపై పడిన దుండగుడు అతని నుండి డబ్బు లాక్కోవడంతో పాటు కాల్పులు జరిపి అక్కడి నుండి పారిపోయాడు. బీబీఏ పూర్తి చేసిన సాయి తేజ నాలుగు నెలల క్రితం విస్కాన్సిన్‌లోని కాంకోర్డియా యూనివర్సిటీలో ఎంఎస్‌ చేసేందుకు అమెరికా వెళ్లారు. 
 
గత కొన్ని రోజులుగా పెట్రోల్‌ పంపులో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్నాడు. దుండగలు దోపిడీని పూర్తి చేసి, బయలుదేరబోతున్నప్పుడు, అతను ప్రతిఘటించడానికి ప్రయత్నించకపోయినా, వారు అతనిని కాల్చి చంపారు. ఈ ఘటనపై  విదేశాంగ మంత్రి (ఈఏఎం) ఎస్ జైశంకర్ సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుడి కుటుంబానికి భారత కాన్సులేట్ అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తోందని తెలిపారు. 
Sai Teja
 
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సభ్యులతో మాట్లాడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో వారి సహాయం కోరినట్లు తెలుస్తోంది. మృతదేహం వచ్చే వారం భారత్‌కు చేరుకునే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments