చేయని నేరానికి జైలుశిక్ష - రూ.11 కోట్ల పరిహారం

ఠాగూర్
శుక్రవారం, 8 ఆగస్టు 2025 (11:34 IST)
కడపున పుట్టిన నలుగురు పిల్లలను కడతేర్చిన నేరారోపణలపై 20 యేళ్ల జైలు జీవితం గడిపిన ఓ మహిళకు 2 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.11 కోట్లు) పరిహారంగా ఇచ్చేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ కేసులో ఆమె నిర్దోషి అని తేలడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. న్యూసౌత్ వేల్స్‌కు చెందిన కాథ్లీన్ ఫోల్బిగ్ (58)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. 
 
1989 - 99 మధ్య కాలంలో ఆ నలుగురూ ఆకస్మికంగా మృతి చెందారు. కన్నతల్లే వారిని హత్య చేసినట్టు ఆరోపణలు చ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిల్లల పెంపకం, కష్టాలపై కాథ్లీన్‌ ఫోల్బింగ్ తన డైరీలో రాసుకున్న రాతలు, ఇతరత్రా సాక్ష్యాల ఆధారంగా 2003లో ఆమెకు 30 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 
 
అయితే, తాను ఏ తప్పూ చేయలేదంటూ ఆమె న్యాయ పోరాటం చేసింది. ఆమె పిల్లలు  నలుగురూ సహజ కారణాలతోనే మరణించివుంటారని శాస్త్రీ ఆధారాలు తేల్చాయి. దీంతో 20 యేళ్ళ తర్వాత ఆ మహిల నిర్దోషిగా జైలు నుంచి విడుదలకాగా, ఆమెకు ఆస్ట్రేలియా ప్రభుత్వం రూ.11 కోట్ల మేరకు పరిహారం చెల్లించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments