Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘనిస్థాన్‌లో వైమానిక దాడులు.. 14మంది తాలిబన్ ఉగ్రవాదుల హతం

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (15:54 IST)
అమెరికా దళాలు ఆఫ్ఘన్ నుంచి వైదొలిగిన నాటి నుంచి దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోయాయి. భద్రతా దళాలు, రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకొని దాడులకు దిగుతున్నారు ఉగ్రవాదులు. ఇక ఈ నేపథ్యంలోనే భద్రతా దళాలు కూడా ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం అర్ధరాత్రి దాడి చేశాయి వైమానిక దళాలు. 
 
ఇలా ఆఫ్ఘనిస్థాన్ వైమానిక దళాలు జరిపిన దాడిలో 14 మంది తాలిబన్ ఉగ్రవాదులు మరణించారు. ఫిరోజ్ నఖ్చిర్ సబర్బన్ జిల్లాలోని కుష్మల్ గ్రామంలో తాలిబన్ రహస్య స్థావరంపై వైమానిక దళాలు దాడులు చేశాయి. ఈ దాడిలో 14 మంది అక్కడికక్కడే చనిపోయినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
ఈ దాడి సోమవారం రాత్రి జరిగినట్లుగా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు స్థావరంలో ఉంచిన గ్రేనేడ్ లాంచర్లు, రెండు భారీ తుపాకులు, మరికొన్ని మారణాయుధాలు కూడా ధ్వంసమైనట్లు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments