ఆఫ్ఘనిస్థాన్‌లో వైమానిక దాడులు.. 14మంది తాలిబన్ ఉగ్రవాదుల హతం

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (15:54 IST)
అమెరికా దళాలు ఆఫ్ఘన్ నుంచి వైదొలిగిన నాటి నుంచి దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోయాయి. భద్రతా దళాలు, రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకొని దాడులకు దిగుతున్నారు ఉగ్రవాదులు. ఇక ఈ నేపథ్యంలోనే భద్రతా దళాలు కూడా ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం అర్ధరాత్రి దాడి చేశాయి వైమానిక దళాలు. 
 
ఇలా ఆఫ్ఘనిస్థాన్ వైమానిక దళాలు జరిపిన దాడిలో 14 మంది తాలిబన్ ఉగ్రవాదులు మరణించారు. ఫిరోజ్ నఖ్చిర్ సబర్బన్ జిల్లాలోని కుష్మల్ గ్రామంలో తాలిబన్ రహస్య స్థావరంపై వైమానిక దళాలు దాడులు చేశాయి. ఈ దాడిలో 14 మంది అక్కడికక్కడే చనిపోయినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
ఈ దాడి సోమవారం రాత్రి జరిగినట్లుగా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు స్థావరంలో ఉంచిన గ్రేనేడ్ లాంచర్లు, రెండు భారీ తుపాకులు, మరికొన్ని మారణాయుధాలు కూడా ధ్వంసమైనట్లు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments