Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక సంక్షోభంలో ఆప్ఘనిస్థాన్.. ఉచితంగా గోధుమల పంపిణీ

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (21:33 IST)
ఆప్ఘనిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నిరుద్యోగం, ఆకలి కేకలతో అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. ఇటీవల పశ్చిమ కాబూల్‌లో ఎనిమిది మంది చిన్నారులు ఆకలితో చనిపోవడం దీన పరిస్థితులకు గుర్తు చేస్తోంది. దీంతో ఆప్ఘన్ ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఆకలి చావులను నిరోధించేందుకు గాను ‘పనికి గోధుమల పంపిణీ’ని ప్రారంభించింది. అంటే పని చేసిన వారికి వేతనం బదులుగా గోధుమలను పంపిణీ చేయనుంది.
 
ఈ మేరకు అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌లో తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ అధికారికంగా గోధుమల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అఫ్గాన్‌ వ్యవసాయ మంత్రి అబ్దుల్‌ రెహ్మాన్‌ రషీద్‌, కాబూల్‌ మేయర్‌ హమ్‌దుల్లా నొమాని తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
కాబూల్‌లోనే కాకుండా హెరాత్‌, జలాలాబాద్‌, కాందహార్‌, మజారే షరీఫ్‌ తదితర నగరాలు, పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తాలిబన్లు తెలిపారు. అదేవిధంగా కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు విస్తృతంగా కాలువల నిర్మాణం చేపడతామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments