Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్ల కాల్పులు.. కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద తొక్కిసలాట

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (14:29 IST)
తాలిబన్ తీవ్రవాదుల వశమైన ఆప్ఘనిస్థాన్‌లో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. ఆప్ఘన్ దేశాన్ని తాలిబన్ల ఆక్రమణ తర్వాత ఆ దేశాన్ని వీడేందుకు పెద్ద ఎత్తున ఆప్ఘన్ పౌరులు కాబూల్‌ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు.
 
తాలిబన్ల అరాచకాలతో దేశం విడిచి వెళ్లేందుకు అఫ్గన్ పౌరులు కాబూల్ విమానాశ్రయానికి పోటెత్తుతున్నారు. ముష్కరుల దురాగతాల నుంచి తప్పించుకోవాలనే తాపత్రయంలో ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్నారు. 
 
గతవారం బయలుదేరుతున్న అమెరికా విమానం రెక్కలపైకి ఎక్కి వెళ్లేందుకు ప్రయత్నించి ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. తాజాగా, కాబూల్ విమానాశ్రయానికి భారీ సంఖ్యలో జనం చేరుకోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అఫ్గన్ పౌరులు మృతిచెందారు.
 
విమానాశ్రయానికి జనం పోటెత్తడంతో తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరపడం వల్ల పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు బ్రిటన్ రక్షణ శాఖ వెల్లడించింది. ఈ ఘటనలో ఏడుగురు అఫ్గన్ పౌరులు చనిపోయారని, మరికొందరు గాయపడ్డారని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments