Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవాన్ని సూపర్ మార్కెట్లో పెట్టుకుని వ్యాపారం చేస్తారా? మానవత్వం ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (20:52 IST)
umbrellas
మానవత్వం మంటగలిసిపోయింది. కరోనా వంటి రోగాలు వచ్చినా.. మనిషిలో మానవత్వం లేకుండా పోయింది. తాజాగా ఓ సూపర్ మార్కెట్‌లో పనిచేసే వ్యక్తి చనిపోతే.. సదరు సూపర్ మార్కెట్ యాజమాన్యం మాత్రం అస్సలు పట్టించుకోలేదు.

అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం అందివ్వకుండా శవం మీద గొడుగులు కప్పి పేలాలు ఏరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో ఆ సూపర్ మార్కెట్ నిర్వాకం బయటి ప్రపంచానికి తెలిసింది. దీంతో యాజమాన్యం తాము చేసిన పనికి క్షమాపణలు చెప్పింది. ఈ వ్యవహారంలో బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌లోని కర్రెఫోర్ సూపర్ మార్కెట్‌లో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న మోయిసెస్ సంతోస్ కవాల్కంటే అనే ఉద్యోగి గుండె నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. అయితే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా స్టోర్‌లోనే అత్యవసర చికిత్స అందించారు. ఆ చికిత్స సరిపోకపోయేసరికి అతను మృతిచెందాడు. అతను మరణించినా.. యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోలేదు. 
 
అతని కుటుంబానికి సమాచారం అందివ్వలేదు. అతని చావుతో తమ వ్యాపారం ఎక్కడ ఆగిపోతుందోనని శవాన్ని ఒక మూలన పెట్టి చుట్టూ గొడుగులు, డబ్బాలు కప్పారు. ఈ విషయం తెలిసిన కొంతమంది ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి కాస్తా వైరల్ కావడంతో ఆ సూపర్ మార్కెట్ యాజమాన్యంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని నెటిజన్లు చీవాట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments