Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు సందేశం ఇవ్వడం కోసం కొబ్బరి చెట్టెక్కి ప్రసంగించిన శ్రీలంక మంత్రి

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (22:26 IST)
శ్రీలంక మంత్రి అరుందిక పెర్నాండో ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. దేశంలో కొబ్బరికాయ కొరత ఉందని ఆ లోటును అధికమించాల్సి ఉందని సందేశాన్ని రైతులకు ఇవ్వడం కోసం కొబ్బరి చెట్టెక్కి ప్రసంగించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతు న్నాయి.
 
శ్రీలంకలో కొబ్బరికాయలకు అత్యధికంగా డిమాండు ఏర్పడ్డాయి. 700 మిలియన్ల కొబ్బరికాయలు లోటు ఏర్పడిందని తెలిపారు. స్థానిక పరిశ్రమ దేశీయ అవసరాల కోసం కొబ్బరికాయల వినియోగం పెరిగినందున డిమాండు ఏర్పడిందని పేర్కొన్నారు. అందుకే అందుబాటులో ఉన్న ప్రతి ఖాలీ స్థలంలో కొబ్బరి పంట సాగు చేయాలని రైతులకు పెర్నాండో పిలుపునిచ్చారు.
 
కొబ్బరి పంటలను విస్తృతంగా సాగుచేసి పరిశ్రమకు దన్నుగా నిలవడమే కాకుండా దేశానికి విదేశీ మారకద్రవ్యం అర్జించడంలో తోడ్పాటు అందించాలని సూచించారు. కాగా పెర్నాండో కొబ్బరి చెట్లు ఎక్కేందుకు ఉపయోగించే ఆధునిక పరికరం సాయంతో చెట్లు ఎక్కారు. దాంతో ఓ చేతిలో కొబ్బరికాయతో ఆయన ప్రసంగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి తర్వాత కుటుంబంతో చూసేలా లిటిల్ హార్ట్స్ - ఆదిత్య హాసన్, సాయి కృష్ణ

నా చిత్రాలేకాదు కొత్తవారికి అవకాశం కోసమే నిర్మాణసంస్థ ప్రారంభించా : రవి మోహన్

మన శంకరప్రసాద్‌గారిని కలిసేందుకు సైకిల్‌పై వచ్చిన మహిళా వీరాభిమాని (వీడియో)

Vishal engagment: నేడు నిశ్చితార్థం జరుపుకున్నవిశాల్, సాయి ధన్సిక

Chiru: అభిమాని రాజేశ్వరి పట్ల మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయ స్పందన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments