Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన ప్రభుత్వం

Webdunia
శనివారం, 21 మే 2022 (17:23 IST)
ఆర్థిక సంక్షోభంలో కూరుకుని ప్రజల తిరుగుబాటులో ఎమర్జెన్సీలోకి వెళ్లిన శ్రీలంకలో పరిస్థితులు ఇపుడిపుడే చక్కబడుతున్నాయి. దీంతో గత రెండు వారాలుగా అమల్లో ఉన్న అత్యవసర పరిస్థితిని ఆ దేశ ప్రభుత్వం ఎత్తివేసింది. పైగా, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. 
 
తీవ్ర ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకున్న శ్రీలంక.. ప్రజలకు నిత్యావసరాలను కూడా అందించలేని దయనీయ స్థితిలోకి వెళ్లింది. ఇప్పటికే అలాంటి గడ్డు పరిస్థితులే నెలకొనివున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన బాటపట్టారు. వారిని అదుపు చేసేందుకు వీలుగా ఎమర్జెన్సీని విధించారు. మే ఆరో తేదీ నుంచి అమల్లోకి తెచ్చారు. హింసాత్మక చర్యలకు పాల్పడేవారిని నిర్బంధంలోకి తీసుకునేందుకు పోలీసులు విశేష అధికారాలను కల్పిస్తూ ఆ దేశ అధ్యక్షుడు గొటబాయి రాజపక్స ఉత్తర్వులు జారీచేశారు. 
 
అయితే ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో దేశంలో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయని భావించిన దేశాధ్యక్షుడు ఎమర్జెన్సీని ఎత్తివేసినట్టు స్థానిక మీడియా హిరు న్యూస్ వెల్లడించింది. కాగా, ప్రజా తిరుగుబాటుతో ఆ దేశ ప్రధానిగా ఉన్న మహీందా రాజపక్స తన పదవికి రాజీనామా చేయగా, ఆయన స్థానంలో రణిల్ విక్రమ సింఘే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments