Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక.. బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడం నిషేధం..

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (12:04 IST)
శ్రీలంక ప్రభుత్వం ముస్లిం మహిళల విషయంలో అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడాన్ని నిషేధిస్తూ శ్రీలంక మంత్రిమండలి తీర్మానించింది. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019లో ఈస్టర్ రోజున నేషనల్ తావీద్ జమాత్ ఆత్మాహుతి దళానికి చెందిన 9 మంది ఉగ్రవాదులు బురఖా ధరించి చర్చ్‌లు, హోటళ్లపై పేలుళ్లకు తెగబడిన విషయం తెలిసిందే. 
 
ఈ ఘెరకలి ఒక్క శ్రీలంకనే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. శ్రీలంకలో జరిగిన ఈ వరస దాడుల్లో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 500 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో కొంతమంది భారతీయులు కూడా ఉన్నారు.
 
ఈ పరిస్థిలుల్లో జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకున్న లంక ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే ముసుగులు ధరించరాదని తీసుకున్న నిర్ణయాన్ని మంగళవారం (ఏఫ్రిల్ 27,2021)న మంత్రి మండలి ఆమోదించింది. 
 
కేబినెట్ నిర్ణయాన్ని పార్లమెంటు ఆమోదించిన వెంటనే చట్టంగా మారుతుంది. ఈ విషయాన్ని కేబినెట్ ప్రతినిథి రాంబుక్వెల్లా మీడియాకు తెలిపారు. అయితే, కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించడంపై మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments