Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈస్టర్ సండే పేలుళ్లు : 310కి చేరిన మృతులు... 40 మంది అనుమానితుల అరెస్టు

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (11:40 IST)
శ్రీలంకలో ఈస్టర్ సండే రోజున వరుస బాంబు పేలుళ్లు జరుగగా, ఈ పేలుళ్ళలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మంగళవారానికి 310కి చేరింది. ఈ పేలుళ్ళలో గాయపడిన క్షతగాత్రుల్లో అనేకమంది పరిస్థితి మరింత విషమంగా ఉంది. ఇకపోతే, ఈ పేలుళ్ళకు సూత్రధారులుగా భావిస్తున్న 40 మంది అనుమానితులను శ్రీలంక భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరంతా శ్రీలంక జాతీయులే కావడం గమనార్హం. 
 
మరోవైపు, సోమవారం అర్థరాత్రి నుంచి శ్రీలంకలో ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. దీంతో భద్రతా బలగాలు ఆ దేశంలోని ప్రతి అంగుళాన్ని జల్లెడ పడుతున్నాయి. ఇంకోవైపు, విదేశీ దౌత్యవేత్తలు, హైకమిషనర్లతో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన భేటీకానున్నారు. ఈ సందర్భంగా పేలుళ్ళ గురించి వారికి వివరించడమే కాకుండా అంతర్జాతీయ దౌత్య సహకారాన్ని ఆయన కోరనున్నారు. 
 
ఇదిలావంటే, ఈ పేలుళ్ళ వెనుక ఐసిస్ హస్తమున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు అనుమానితుల ఛాయాచిత్రాలను విడుదల చేసింది. అంతేకాకుండా, స్థానిత తీవ్రవాద సంస్థకు ఐసిస్ ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఈ పేలుళ్ళపై శ్రీలంక అంతర్జాతీయ దర్యాప్తును కోరే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments