పాలపుంతలో వింత వస్తువు.. ప్రతి 18.18 నిమిషాలకు..?

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (16:59 IST)
Milky Way
పాలపుంతలో ఓ వింత వస్తువును శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రతి 18.18 నిమిషాలకు ఓ రేడియో సిగ్నల్‌ను అది భూమికి పంపిస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. తానూ మొదట ఆ సిగ్నళ్లు ఏలియన్స్ పనేనని అనుకున్నానని నటాషా హర్లీ వాకర్ అనే భౌతికశాస్త్రవేత్త తెలిపారు. 
 
అంతా విశ్లేషించాక ఆ మిస్టరీ వస్తువు నుంచి వస్తున్న సిగ్నళ్లు రకరకాల తరంగదైర్ఘ్యాలతో ఉన్నాయని నటాషా వెల్లడించారు. కాబట్టి అవి కృత్రిమ సిగ్నల్స్ అయి ఉండే అవకాశమే లేదని, సహజంగా వస్తున్నవేనని అన్నారు.
 
ఇకపోతే.. డిగ్రీ ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా ఓ విద్యార్థి మొదట దానిని గుర్తించాడు. వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని మర్కిసన్ వైడ్ ఫీల్డ్ అర్రేలో టెలిస్కోప్ సాయంతో ఆ విద్యార్థి దీనిని గుర్తించాడు. దానిని ప్రస్తుతానికి "అల్ట్రా లాంగ్ పీరియడ్ మాగ్నెటార్" అని పిలుస్తున్నారు.
 
ప్రస్తుతం అది భూమికి 4 వేల కాంతి సంవత్సరాల దూరంలో వుంది. చాలా కాంతిమంతంగా..  అయస్కాంత క్షేత్రం అత్యంత ప్రబలంగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎప్పటి నుంచో అది పాలపుంతలో ఉండి ఉండవచ్చునని, అయితే, ఇప్పటిదాకా ఎవరూ గుర్తించలేకపోయారని చెప్తున్నారు. అంతరిక్షం నుండి వచ్చే శక్తివంతమైన, స్థిరమైన రేడియో సిగ్నల్‌ను వేరే ఏదైనా జీవ రూపం ద్వారా పంపారా అనే ప్రశ్నపై ఆయన అంగీకారం తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments