Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ సీఈవోగా నేను తప్పుకోవాలా? వద్దా? ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ పోల్

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (11:26 IST)
మైక్రోమెసేజింగ్ యాప్ ట్విట్టర్‌ను తన సొంతం చేసుకున్న తర్వాత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్... ట్విట్టర్‌లో అనేక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా, సరికొత్త మార్పులకు ఆయన శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ సీఈవోగా తాను ఉండాలా? వద్దా? అనే అంశంపై ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఆయన ట్విట్టర‌లో ఓ పోల్ పెట్టారు. 
 
ఈ పోల్‌లో నెటిజన్లు వద్దంటే సీఈవో పోస్టు నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఈ పోల్‌కు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఫలితంగా సోమవారం ఉదయం వరకు 56 శాతం మంది తప్పుకోవడమే ఉత్తమమని సెలవిచ్చారు. మరో 44 శాతం మంది ట్విట్టర్ యూజర్లు మాత్రం సంస్థ సీఈవోగా మస్క్ కొనసాగాలని అభిప్రాయపడ్డారు. 
 
కాగా, గతంలో కూడా ట్విట్టర్ బ్యాన్ చేసిన వ్యక్తులను తిరిగి ఆహ్వానించే విషయంపై కూడా మస్క్ ట్విట్టర్‌లో పోల్ నిర్వహించారు. ఇందులో వచ్చిన ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌‌పై ట్విట్టర్ నిషేధం ఎత్తివేత కూడా ఇందులోభాగంగా తీసుకున్న నిర్ణయమే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments