Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ సీఈవోగా నేను తప్పుకోవాలా? వద్దా? ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ పోల్

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (11:26 IST)
మైక్రోమెసేజింగ్ యాప్ ట్విట్టర్‌ను తన సొంతం చేసుకున్న తర్వాత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్... ట్విట్టర్‌లో అనేక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా, సరికొత్త మార్పులకు ఆయన శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ సీఈవోగా తాను ఉండాలా? వద్దా? అనే అంశంపై ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఆయన ట్విట్టర‌లో ఓ పోల్ పెట్టారు. 
 
ఈ పోల్‌లో నెటిజన్లు వద్దంటే సీఈవో పోస్టు నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఈ పోల్‌కు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఫలితంగా సోమవారం ఉదయం వరకు 56 శాతం మంది తప్పుకోవడమే ఉత్తమమని సెలవిచ్చారు. మరో 44 శాతం మంది ట్విట్టర్ యూజర్లు మాత్రం సంస్థ సీఈవోగా మస్క్ కొనసాగాలని అభిప్రాయపడ్డారు. 
 
కాగా, గతంలో కూడా ట్విట్టర్ బ్యాన్ చేసిన వ్యక్తులను తిరిగి ఆహ్వానించే విషయంపై కూడా మస్క్ ట్విట్టర్‌లో పోల్ నిర్వహించారు. ఇందులో వచ్చిన ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌‌పై ట్విట్టర్ నిషేధం ఎత్తివేత కూడా ఇందులోభాగంగా తీసుకున్న నిర్ణయమే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినీ బృందం (video)

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments