Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బును దొంగలించాడు.. కేరళ యువకుడి చేతులు నరికేయండి...

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (16:57 IST)
కేరళ రాష్ట్రానికి చెందిన యువకునికి సౌదీ అరేబియా కఠిన శిక్షను జారీ చేసింది. సౌదీలోని హోటల్‌లో ఓ యువకుడు ఆరేళ్ల పాటు పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక లక్ష రూపాయలు చోరీకి గురయ్యాయి. ఈ చోరీకి ఆ హోటల్‌లో పనిచేసే యువకుడే కారణమని నిర్ధారణ అయ్యింది. దీంతో సౌదీకి ఆ యువకుడిని మరో వ్యక్తి తీసుకెళ్లాడు. 
 
దొంగలించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తానని సదరు యువకుడు హామీ ఇచ్చాడు. కానీ డబ్బు ఇవ్వకుండా సాకులు చెప్పసాగాడు. దీంతో విసిగిపోయిన వ్యక్తి.. యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరీకి పాల్పడిన యువకుడిని అరెస్ట్ చేశారు. అలాగే అతని గదిలో జరిపిన తనిఖీల్లో దొంగలించిన డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నారు.  
 
దీనిపై కోర్టులో విచారణ జరిగింది. విచారణలో హోటల్‌లో ఆ యువకుడు దొంగలించిన మాట వాస్తవమేనని తేలింది. ఫలితంగా సౌదీ చట్టం ప్రకారం ఆ యువకుడి చేతులను నరకాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన సౌదీలో పెను సంచలనం సృష్టించింది.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments