Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌదీలో కేరళ వాసుల హత్య... ముగ్గురికి బహిరంగ శిరచ్ఛేదం

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (09:21 IST)
కేరళ రాష్ట్రానికి చెందిన ఐదుగురుని చిత్రహింసలకుగురిచేసి సజీవంగా పాతిపెట్టిన కేసులో దోషులుగా తేలిన ముగ్గురికి బహిరంగ శిరచ్ఛేద శిక్షను సౌదీ ప్రభుత్వం అమలు చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గత 2014లో ఒక సౌదీ అరేబియా రైతు తన వ్యవసాయ భూమిలో పైపులను భూమిలో వేసేందుకు తవ్వుతుండగా కొన్ని ఎముకలు బయటపడ్డాయి. తొలుత జంతువుల ఎముకలుగా భావించారు. ఆ తర్వాత అస్థిపంజరం లభించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన సౌదీ పౌలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో మరో నాలుగు అస్థిపంజరాలు లభించాయి. అందులో కొందరి నోటికి టేపులు చుట్టి, కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసి ఉండటం గమనించారు.
 
అస్థిపంజరాల సమీపంలో లభ్యమైన వీసా కార్డు ఆధారంగా మరింత లోకుగా దర్యాప్తు చేపట్టగా మృతులంతా కేరళ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు. తన కూతురు, మరో మహిళను వేధించినందుకుగానూ ఒక సౌదీ యజమాని వారిని చిత్రహింసలకు గురిచేసి సజీవంగా పాతిపెట్టినట్లు ఈ దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసులో మొత్తం 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా, వీరిలో ముగ్గురిని కోర్టు దోషులుగా తేల్చి మరణశిక్షను విధించింది. ఫలితంగా ఈ ముగ్గురికి ఖతీఫ్‌ పట్టణంలో బహిరంగంగా శిరచ్ఛేదం చేసి మరణశిక్ష అమలు చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments