Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో ద్వైపాక్షిక చర్చలు ఉండవ్.. తేల్చి చెప్పిన పాకిస్తాన్

ఠాగూర్
మంగళవారం, 8 అక్టోబరు 2024 (09:51 IST)
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సు ఈ నెల 15, 16వ తేదీల్లో జరుగనుంది. ఈ సదస్సుకు పాకిస్తాన్ ఆతిథ్యమిస్తుంది. ఈ సదస్సుకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ హాజరువుతున్నారు. ఈ తరుణణంలో పాకిస్తాన్ కీలక ప్రకటన చేసింది. 
 
భారత్ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాక్ పర్యటన సందర్భంగా భారత్‌తో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు ఉండబోవని స్పష్టం చేసింది. చర్చలకు అవకాశం లేదని తెలిపింది. ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ ఒక ప్రకటన విడుదల చేశారు. జైశంకర్ పర్యటన, భారత్-పాకిస్థాన్ సంబంధాలపై మీడియా ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు.
 
'ఈ పర్యటనకు సంబంధించి పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం అందింది. షాంఘై సదస్సు సభ్య దేశాల సభ్యులందరినీ స్వాగతించడానికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం చెప్పింది. ఇక భారత్‌తో ద్వైపాక్షిక సమావేశాలకు సంబంధించిన మీ ప్రశ్నకు అక్టోబరు 5వ తేదీన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించాలనుకుంటున్నాను. నా పర్యటన పాక్షిక కార్యక్రమమని జైశంకర్ చెప్పారు. పాకిస్థాన్‌తో చర్చల కోసం కాదన్నారు. ఈ వ్యాఖ్యలు వివరణాత్మకమైనవి' అని ముంతాజ్ జహ్రా బలోచ్ ప్రస్తావించారు.
 
కాగా ఇస్లామాబాద్లో జరిగే ఎస్సీవో సదస్సులో పాల్గొనేందుకు వెళ్లనున్న భారత బృందానికి విదేశాంగమంత్రి జైశంకర్ నేతృత్వం వహిస్తారని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments