Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యా దాడిలో ఐదుగురు ఉక్రెయిన్ సైనికులు మృతి

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (07:59 IST)
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం మొదలైనట్టుగా కనిపిస్తుంది. తాజాగా రష్యా సైనికులు జరిపిన దాడిలో ఐదుగురు ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైందని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
మరోవైపు, ఉక్రెయిన్ సేనలు తమ భూభాగంలోకి చొరబడ్డాయని రష్యా ఆరోపించగా, అదేమీ లేదంటూ ఉక్రెయిన్ స్పష్టం చేసింది. అయితే ఉక్రెయిన్ సేనలు తమ భూభాగంలోకి చొచ్చుకువచ్చినందుకే ఆ దేశ సైనికులను హతమార్చినట్టు రష్యా అధికారులు వెల్లడించడం గమనార్హం. 
 
మరోవైపు, ఈ యుద్ధాన్ని నివారించేందుకు మధ్యవర్తిత్వం జరిపేందుకు సిద్ధమని అగ్రరాజ్యాధినేత జో బైడెన్ మరోమారు ప్రకటించారు. యుద్ధాన్ని నివారించేందుకు తగిన సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన తాజాగా ప్రకటించారు. 
 
ఇదిలావుంటే, రష్యా, ఉక్రెయిన్ దేశాల సరిహద్దుల్లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగానేవుంది. పశ్చిమ భాగంలో ఇరు దేశాల సైనికుల మొహరింపు, వేర్పాటువాదుల నుంచి ఉక్రెయిన్‌పై దాడులు, ప్రతిగా ఉక్రెయిన్ జరుపుతున్న దాడుల్లో రష్యాకు భారీగానే ఆస్తి నష్టం వాటిల్లుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments