Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యా నుంచి భారత్‌కు వైద్య సామాగ్రి.. 150 బెడ్‌సైడ్ మానిటర్లు..

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (11:27 IST)
భారత్‌లో కరోనా మహమ్మారి ఉధృతి అంతకంతకూ పెరిగిపోతున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలోని ఆస్పత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. 
 
రోగుల తాకిడి పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌తోపాటు, ఇతర వైద్య సామాగ్రి కూడా నిండుకుంటుంది. ఈ నేపథ్యంలో పొరుగుదేశాలన్నీ భారత్‌కు సహాయ సహకారాలు అందించేందుకు ముందుకొస్తున్నాయి.
 
తాజాగా రష్యా కూడా భారత్‌కు భారీగా వైద్యసామాగ్రిని పంపింది. రష్యా నుంచి 20 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, 75 వెంటిలేటర్లు, 150 బెడ్‌సైడ్ మానిటర్లు, 22 మెట్రిక్ టన్నుల ఔషధాలతో బుధవారం బయలుదేరిన రెండు విమానాలు ఈ తెల్లవారుజామున ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాయి.
 
విమానాల నుంచి వైద్య సామాగ్రిని అన్‌లోడ్ చేయించిన అధికారులు అవసరమున్న వివిధ ఆస్పత్రులకు దాన్ని చేరేవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

Rashmika: ప్రేమికులుగా మనం ఎంతవరకు కరెక్ట్ ? అంటున్న రశ్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments