Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 287 కోట్ల లాటరీ, డబ్బు అందుకునేలోపుగా అతడిని వెంటాడిన మృత్యువు

ఐవీఆర్
బుధవారం, 18 డిశెంబరు 2024 (18:50 IST)
లాటరీలో అతడికి ఏకంగా 287 కోట్ల రూపాయలు వచ్చాయి. పైగా అతడు ఓ మామూలు రైతు. కూలి పనులు చేసుకునే రైతుని ఒక్కసారిగా ధనలక్ష్మి కరుణించడంతో కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు. లాటరీ ద్వారా వచ్చిన డబ్బుతో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేయాలనుకున్నాడు. ఇంకా తనకు వున్న కోరికలన్నీ తీర్చుకోవాలనుకున్నాడు. ఇంతలో అతడిని ఎన్నాళ్లుగానో వేధిస్తున్న పంటినొప్పి గుర్తుకు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి శస్త్రచికిత్స చేయించుకునేందుకు చేరిపోయాడు.
 
అక్కడ వైద్యులు అతడికి ఆపరేషన్ చేస్తుండగా అనూహ్యంగా మృతి చెందాడు. లాటరీలో తగిలిన డబ్బును అప్పజెప్పేందుకు పోలీసు బందోబస్తు అతడిని వెతుక్కుంటూ రాగా ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుసుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని అతడి గురించి వాకబు చేయగా శస్త్ర చికిత్స చేస్తున్న సమయంలో అతడికి గుండెపోటు వచ్చి మరణించినట్లు వైద్యులు తెలిపారు. కోట్ల రూపాయలు వచ్చినా వాటిని అనుభవించేలోపే అతడు మృత్యువాత పడటంతో అక్కడ విషాదం అలముకుంది. ఈ ఘటన బ్రెజిల్ దేశంలో జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments