Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 287 కోట్ల లాటరీ, డబ్బు అందుకునేలోపుగా అతడిని వెంటాడిన మృత్యువు

ఐవీఆర్
బుధవారం, 18 డిశెంబరు 2024 (18:50 IST)
లాటరీలో అతడికి ఏకంగా 287 కోట్ల రూపాయలు వచ్చాయి. పైగా అతడు ఓ మామూలు రైతు. కూలి పనులు చేసుకునే రైతుని ఒక్కసారిగా ధనలక్ష్మి కరుణించడంతో కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు. లాటరీ ద్వారా వచ్చిన డబ్బుతో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేయాలనుకున్నాడు. ఇంకా తనకు వున్న కోరికలన్నీ తీర్చుకోవాలనుకున్నాడు. ఇంతలో అతడిని ఎన్నాళ్లుగానో వేధిస్తున్న పంటినొప్పి గుర్తుకు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి శస్త్రచికిత్స చేయించుకునేందుకు చేరిపోయాడు.
 
అక్కడ వైద్యులు అతడికి ఆపరేషన్ చేస్తుండగా అనూహ్యంగా మృతి చెందాడు. లాటరీలో తగిలిన డబ్బును అప్పజెప్పేందుకు పోలీసు బందోబస్తు అతడిని వెతుక్కుంటూ రాగా ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుసుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని అతడి గురించి వాకబు చేయగా శస్త్ర చికిత్స చేస్తున్న సమయంలో అతడికి గుండెపోటు వచ్చి మరణించినట్లు వైద్యులు తెలిపారు. కోట్ల రూపాయలు వచ్చినా వాటిని అనుభవించేలోపే అతడు మృత్యువాత పడటంతో అక్కడ విషాదం అలముకుంది. ఈ ఘటన బ్రెజిల్ దేశంలో జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments