Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాందహార్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై రాకెట్ల దాడి

Webdunia
ఆదివారం, 1 ఆగస్టు 2021 (13:53 IST)
అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై శనివారం రాత్రి తాలిబన్లు మూడు రాకెట్లు ప్రయోగించారని అధికారులు తెలిపారు. రెండు రాకెట్లు రన్‌వే తాకడంతో విమానాల రాకపోకలను రద్దు చేశామని చెప్పారు.

రన్‌వే మరమ్మతు పనులు జరుగుతున్నాయని, ఆదివారం సాయంత్రం నుండి సేవలను అందుబాటులోకి తెస్తామని ఎయిర్‌పోర్ట చీఫ్‌ మసూద్‌ పష్టున్‌ తెలిపారు. అమెరికా, నాటో బలగాల నిష్క్రమణ తర్వాత ఆఫ్గాన్‌లో తాలిబన్లు పలు ప్రాంతాలను తమ చేతులోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే 80 శాతం భూభాగం వారు ఆక్రమించుకున్నారు. ఈ క్రమంలో అఫ్గాన్‌ సైన్యం, తాలిబన్ల మధ్య భీకర పోరు జరుగుతోంది. కాబుల్‌లోని సివిల్‌ ఏవియేషన్‌ అధికారి ఈ రాకెట్‌ దాడిని ధ్రువీకరించారు. కావాల్సిన లాజిస్టిక్‌, వాయుసేన సహకారం ఇక్కడి నుంచే కొనసాగుతోన్న నేపథ్యంలోనే తాలిబన్లు విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

మరో రెండు రాష్ట్రాల రాజధానులైన హెరాత్‌, లష్కర్‌ ఘాను సైతం సొంతం చేసుకునేందుకు తాలిబన్లు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఈ నగరాల సరిహద్దులకు చేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్లీజ్.. మాజీ భార్య అని పిలవొద్దు : రెహ్మాన్ సతీమణి సైరా

సమంతకు మళ్లీ ఏమైంది? అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్

డీహైడ్రేషన్ వల్లే ఏఆర్ రెహ్మన్ అస్వస్థతకు లోనయ్యారు : వైద్యులు

హైలెట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో బయటకు వస్తున్నారు : అన్నపూర్ణమ్మ

ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్ : స్పందించిన సోదరి ఫాతిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

తర్వాతి కథనం
Show comments