Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీ కార్పొరేషన్ నిధుల మళ్లింపు : సీఎం జగన్‌కు టీడీపీ నేత అనగాని లేఖ

Webdunia
ఆదివారం, 1 ఆగస్టు 2021 (13:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కార్పొరేష‌న్ నిధుల మ‌ళ్లింపుపై ముఖ్య‌మంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ నేత అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ బ‌హిరంగ లేఖ‌ రాశారు. గ‌త రెండేళ్లుగా రాష్ట్ర ప్ర‌భుత్వం బీసీల‌పై తీవ్ర నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శిస్తోందని ఆయన ఆరోపించారు. 
 
నిధుల మ‌ళ్లింపు ప‌థ‌కంతో బీసీల‌కు న‌య‌వంచ‌న‌ చేస్తోందని, బీసీలను ఉద్దరించేశామంటూ మోసం, దగా చేస్తున్నారని ఆరోపించారు. రెండేళ్ల‌లో బీసీ కార్పొరేషన్ల నుంచి రూ.18,050 కోట్లు మళ్లించారన్నారు. బీసీల నిధుల మ‌ళ్లింపు గురించి ఎందుకు మాట్లాడ‌డం లేదని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.
 
అంతేకాకుండా, 2019-20లో రూ.15 వేల కోట్లు కేటాయించి రూ.10,478 కోట్లు మళ్లించారని, 2020-21లో రూ.23 వేల కోట్లు, 2021-22లో రూ.25 వేల కోట్లు మ‌ళ్లించారని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. బీసీ కార్పొర‌ష‌న్ నుంచి రెండేళ్ల‌లో ఒక్క రుణ‌మూ ఇవ్వ‌క‌పోవ‌డం వాస్త‌వం కాదా? అని ప్రశ్నించారు. 
 
45 వేల కాపు కార్పొరేష‌న్ రుణాలు ర‌ద్దు చేయ‌డం వాస్త‌వం కాదా అని నిలదీశారు. కార్పొరేష‌న్, ఫెడ‌రేష‌న్, స‌బ్ ప్లాన్‌ల‌ను నిర్వీర్యం చేశారని విమర్శించారు. టీడీపీ హాయంలో బీసీల‌ను య‌జ‌మానులుగా చేస్తే.. ఇప్పడు సీఎం జగన్ బిచ్చ‌గాళ్లుగా మార్చారని అనగాని స‌త్య‌ప్ర‌సాద్ ఆ లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments