Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందంజలో రిషి సునక్: జూలై 21 వరకు ప్రక్రియ కొనసాగింపు

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (11:00 IST)
బ్రిటన్ ప్రధానమంత్రి, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్ ముందంజలో ఉన్నారు. తక్కువ ఓట్లు పోలైన ఎంపీ టామ్ టుగెండ్‌హమ్ ఈ రేసు నుంచి తప్పుకున్నారు. 
 
రిషి సునక్ తర్వాత వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డెంట్ రెండో స్థానంలో, విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ మూడో స్థానంలో ఉండగా, కేమీ బడెనోచ్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు.
 
జూలై 14న జరిగిన ఓటింగ్‌లో కూడా ఈ నలుగురే తొలి నాలుగు స్థానాల్లో నిలిచారు. అప్పుడు రుషి సునక్ 101 ఓట్లతో అందరి కంటే ముందంజలో ఉండగా, మూడో రౌండ్‌లో ఆయనకు 115 ఓట్లు పోలయ్యాయి.
 
మంగళవారం ఈ నలుగురు అభ్యర్థులకు మరోసారి ఓటింగ్ జరగనుంది. చివరగా ఇద్దరు అభ్యర్థులు మిగిలేంత వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంటుంది. జూలై 21 వరకు ఈ ప్రక్రియ సాగే అవకాశం ఉంది.
 
చివరకు కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు, పోస్టల్ ఓటు ద్వారా పార్టీ నాయకుడిని ఎన్నుకుంటారు. కొత్త ప్రధానిని సెప్టెంబర్ 5న ప్రకటిస్తారు.

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments