Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందంజలో రిషి సునక్: జూలై 21 వరకు ప్రక్రియ కొనసాగింపు

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (11:00 IST)
బ్రిటన్ ప్రధానమంత్రి, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్ ముందంజలో ఉన్నారు. తక్కువ ఓట్లు పోలైన ఎంపీ టామ్ టుగెండ్‌హమ్ ఈ రేసు నుంచి తప్పుకున్నారు. 
 
రిషి సునక్ తర్వాత వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డెంట్ రెండో స్థానంలో, విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ మూడో స్థానంలో ఉండగా, కేమీ బడెనోచ్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు.
 
జూలై 14న జరిగిన ఓటింగ్‌లో కూడా ఈ నలుగురే తొలి నాలుగు స్థానాల్లో నిలిచారు. అప్పుడు రుషి సునక్ 101 ఓట్లతో అందరి కంటే ముందంజలో ఉండగా, మూడో రౌండ్‌లో ఆయనకు 115 ఓట్లు పోలయ్యాయి.
 
మంగళవారం ఈ నలుగురు అభ్యర్థులకు మరోసారి ఓటింగ్ జరగనుంది. చివరగా ఇద్దరు అభ్యర్థులు మిగిలేంత వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంటుంది. జూలై 21 వరకు ఈ ప్రక్రియ సాగే అవకాశం ఉంది.
 
చివరకు కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు, పోస్టల్ ఓటు ద్వారా పార్టీ నాయకుడిని ఎన్నుకుంటారు. కొత్త ప్రధానిని సెప్టెంబర్ 5న ప్రకటిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments