Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైమానిక సేవలను పునరుద్ధరించండి: భారత్ కు తాలిబన్ల వినతి

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (08:32 IST)
ఆఫ్ఘనిస్థాన్‌-భారత్ మధ్య వైమానిక సేవలను పునరుద్ధరించాలని తాలిబన్ ప్రభుత్వం కోరింది. కాబూల్‌కు వాణిజ్య విమానాలను పునరుద్ధరించాలని కోరుతూ డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్)కు ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ ఓ లేఖ రాసింది.

ఈ లేఖను భారత దేశ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సమీక్షిస్తోంది.  ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన తర్వాత కాబూల్‌కు వైమానిక సేవలను భారత దేశం నిలిపేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ప్రయాణికుల సంచారం సజావుగా జరగాలనే ఉద్దేశంతో ఈ లేఖను రాస్తున్నట్లు ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ తెలిపింది.

ఆఫ్ఘనిస్థాన్‌-భారత్ మధ్య వైమానిక సేవలను పునరుద్ధరించాలని కోరింది. అదేవిధంగా ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ క్యారియర్స్ (అరియానా ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్స్, కామ్ ఎయిర్) తమ షెడ్యూల్డు ఫ్లైట్స్‌ను పునరుద్ధరించాలనుకుంటున్నట్లు తెలిపింది.

తమ కమర్షియల్ ఫ్లైట్స్‌ పునరుద్ధరణకు అవకాశం కల్పించాలని ఆఫ్ఘనిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ కోరుతోందని పేర్కొంది. భారత దేశం కాబూల్‌కు చిట్ట చివరిగా ఆగస్టు 21న విమానాన్ని నడిపింది. భారత వాయు సేన విమానంలో భారత పౌరులను కాబూల్ నుంచి తీసుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments