Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెచ్ఐవీకి మందు కనిపెట్టారోచ్.. ట్రయల్స్ సక్సెస్... కానీ..?

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (13:29 IST)
ప్రాణాంతక వ్యాధి హెచ్ఐవీకి మందు వచ్చేసిందట. ఎయిడ్స్ బారిన పడ్డ ఓ వ్యక్తికి సైంటిస్టులు పలు మెడిసిన్లతో చికిత్స ఇవ్వగా.. అతను విజయవంతంగా ఆ వ్యాధి నుంచి బయట పడ్డాడు. ఈ మేరకు 23వ ఇంటర్నేషనల్ ఎయిడ్స్ కాన్ఫరెన్స్ (ఎయిడ్స్ 2020)లో సైంటిస్టులు తమ పరిశోధనలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
 
2012లో హెచ్ఐవీ బారిన పడ్డ ఓ వ్యక్తి 2016లో సైంటిస్టులు నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో అతనికి 48 వారాల పాటు Dolutegravir, Maraviroc అనే రెండు మెడిసిన్లను నిత్యం రెండు సార్లు 500 మిల్లీగ్రాముల మోతాదులో ఇచ్చారు. అలాగే విటమిన్ బి3 పిల్స్‌ను కూడా ఇచ్చారు.
 
అనంతరం మార్చి 2019లో అతనిపై క్లినికల్ ట్రయల్స్ ఆపేశారు. తరువాత 57 వారాల పాటు ప్రతి 3 వారాలకు ఒకసారి ఆ వ్యక్తిలో ఉన్న వైరల్ డీఎన్ఏ గురించి తెలుసుకునేందుకు టెస్టులు చేశారు. ఈ క్రమంలో 57 వారాల అనంతరం అతనిలో హెచ్ఐవీ యాంటీ బాడీలు లేవని తేలింది. అంటే.. ఆ వ్యక్తి పూర్తిగా హెచ్ఐవీ నుంచి కోలుకున్నాడని తేలింది. 
 
ఆ వ్యక్తిపై ప్రయోగం విజయవంతమైనా.. ఇప్పుడిప్పుడే ఆ మెడిసిన్లను ఎయిడ్స్ చికిత్స కోసం వాడలేమని సైంటిస్టులు చెప్తున్నారు. మరిన్ని ప్రయోగాలు చేశాకే వాటిని ఉపయోగించే వీలుంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

చిన్న సినిమాలను బతికించండి, డర్టీ ఫెలో ప్రీ రిలీజ్ లో దర్శకుడు ఆడారి మూర్తి సాయి

కేన్స్‌లో పదర్శించిన 'కన్నప్ప‌' టీజర్ - మే‌ 30న తెలుగు టీజర్

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments